అధ్యక్షుడిగా వెంకటేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా లింగస్వామి గౌడ్
చౌటుప్పల్ మున్సిపాలిటీలోని 13వ వార్డు రామ్నగర్ కాలనీలో 'అభ్యుదయ యూత్ కమిటీ' నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సోమవారం కాలనీలో యూత్ కమిటీ సభ్యులు ప్రత్యేకంగా సమావేశమై ఈ ఎన్నిక ప్రక్రియను పూర్తి చేశారు. కమిటీ నూతన అధ్యక్షుడిగా చెవ్వగొని వెంకటేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా తోర్పునూరి లింగస్వామి గౌడ్, ఉపాధ్యక్షుడిగా మార్గం నరసింహ యాదవ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ.. కాలనీ సమస్యల పరిష్కారంతో పాటు యువతను సన్మార్గంలో నడిపించేందుకు, సంక్షేమ కార్యక్రమాల నిర్వహణకు తమవంతు కృషి చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో గౌరవ సలహాదారులు చెరుకు అశోక్ గౌడ్, వర్కాల కుమార్ గౌడ్, తోర్పునూరి మహేష్ గౌడ్, గౌరవ అధ్యక్షులు తోర్పునూరి బాబు గౌడ్, బొల్లోజు విశ్వరూప చారి, బాలగోని నరసింహ, తోర్పునూరి నరసింహ, తోర్పునూరి రవి, ఉష్కాగుల శ్రీశైలం, కళ్లెం నాగరాజ్, చెవ్వగొని మహేష్, చెరుకు లింగస్వామి, సందగళ్ళ నాగరాజు, తోర్పునూరి సాయి, నవీన్ చారి, చెరుకు రాము, చెవ్వగొని రమేష్, చెరుకు సాయి, తోర్పునూరి శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి