రామన్నపేట: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలనే అమలు చేయాలని, తాము కొత్తగా ఎలాంటి కోరికలు కోరడం లేదని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి. రమణ, కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. రామన్నపేట మండల కేంద్రానికి చేరుకున్న గీతన్నల చైతన్య యాత్రలో వారు మాట్లాడారు.
రాష్ట్రంలో సుమారు 2.30 లక్షల మంది కల్లుగీత కార్మికులకు సభ్యత్వం ఉండగా.. కాటమయ్య రక్షణ కవచం కేవలం 30 వేల మందికే అందించారని తెలిపారు. అర్హులైన గీత కార్మికులందరికీ రక్షణ కవచం అందించాలని కోరారు. ప్రతి గీత కార్మికుల సొసైటీకి 5 ఎకరాల భూమి, నందనంలో నీరా ప్రాజెక్టు ప్రారంభం, బడ్జెట్లో కేటాయించిన రూ.25 కోట్లు, గీత కార్మికుల సంక్షేమానికి కేటాయించిన రూ.67 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే ఈ నెల 18వ తేదీలోగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ట్యాంక్బండ్పై ప్రతిష్ఠించాలని ప్రభుత్వాన్ని కోరారు.
కార్యక్రమంలో యాత్ర బృందం సభ్యులు రాగిరి కృష్ణయ్య, వి. వెంకట నరసయ్య, గౌని ఎంకన్న, చౌగానీ సీతారాములు, గౌని సాంబయ్య, పామనుగుళ్ల అచ్చాలు, మొక్క నాగేశ్వరరావు, బుర్ర సుధాకర్, తాళ్లపల్లి నర్సయ్య, పాలకూరి జగన్, సురుగు రాజేష్ గౌడ్, హనుమాండ్ల కాడి నవీన్, జిల్లా అధ్యక్షుడు రాగిరి కృష్ణయ్య, బోలగోని జయరాములు, గాజుల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి