మౌలాలి డివిజన్ లోని పిల్లి నరసింగరావు కాలనీ ఘనంగా బోనాల వేడుకలు నిర్వహించడం జరిగింది
బోనాలు కేవలం అమ్మవారికి సమర్పించే నైవేద్యం మాత్రమే కాదని, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, భక్తి విశ్వాసాలకు, తరతరాలుగా కొనసాగుతున్న సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు.
పోతరాజుల వీరత్వం, డప్పుల దరువులు, అమ్మవారి ఘటాల ఊరేగింపులు, ఆడపడుచుల భక్తిశ్రద్ధలు తెలంగాణ జీవన సంస్కృతికి సజీవ రూపాలని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా మన సంస్కృతి, భాష, యాస, పండుగలు ప్రజలను ఏకం చేసిన శక్తిగా నిలిచాయని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలోకాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు














































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి