నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్ష
శుభాకాంక్షలు తెలిపిన దేవాలయ కమిటీ చైర్మన్ బొబ్బిళ్ళ మురళి
కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్ కోమటిరెడ్డి లక్ష్మి రాజగోపాల్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. జన్మదినాన్ని పురస్కరించుకుని భవాని నగర్ శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ కమిటీ చైర్మన్ బొబ్బిళ్ళ మురళి వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా బొబ్బిళ్ళ మురళి మాట్లాడుతూ...కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా లక్ష్మి పేద ప్రజలకు నిరంతరం సేవలు అందిస్తూ వారి గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. పేద ప్రజల సేవే ఆశయంగా అహర్నిశలు పాటుపడుతున్న లక్ష్మి కి ఆ భగవంతుడు నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలను, సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా చేపట్టేందుకు కావలసిన శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను అన్నారు.














































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి