కెప్టెన్సీలో మెరిసిన పాక వర్షిత్ యాదవ్
అండర్-17 కేటగిరీలో కైవసమైన మొదటి బహుమతి
వై ఎమ్ సీఏ సెంట్రల్ మైదానంలో ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగిన ‘కార్గిల్ వార్’ అండర్-17 కేటగిరీ కబడ్డీ టోర్నమెంట్లో పాక వర్షిత్ యాదవ్ నాయకత్వంలోని జట్టు విజేతగా నిలిచింది. టోర్నీ అంతటా అద్భుత ప్రదర్శన కనబరిచిన వర్షిత్ సేన, ఫైనల్ మ్యాచ్లో సైతం ప్రత్యర్థి జట్టుపై పైచేయి సాధించి ప్రథమ బహుమతిని ముద్దాడింది. కెప్టెన్గా వర్షిత్ యాదవ్ అందించిన నాయకత్వంతో పాటు, రైడింగ్, టాకిల్స్లో జట్టు చూపిన ప్రతిభ విజయంలో కీలక పాత్ర పోషించింది. విజయ కేతనం ఎగరవేసిన వర్షిత్ యాదవ్ను, జట్టు సభ్యులను నిర్వాహకులు ప్రత్యేకంగా సత్కరించి ట్రోఫీని అందజేశారు. వర్షిత్ సాధించిన ఈ విజయం పట్ల కుటుంబ సభ్యులు, మిత్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి