దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విగ్రహ ఆవిష్కరణ కోసం ఏర్పాటు చేసిన గద్దెను కూల్చివేయడం దుర్మార్గమైన చర్య అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. గద్దె కూల్చిన ప్రదేశాన్ని ఆయన సందర్శించి మాట్లాడారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గద్దెను కూల్చివేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన వెనుక కాంగ్రెస్ నాయకుల ప్రమేయం ఉందనే అనుమానాలు ఉన్నాయని, సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఎన్ని ఆటంకాలు ఎదురైనా పెద్ది సుదర్శన్రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించి తీరుతామని స్పష్టం చేశారు. నర్సంపేటలో ఇప్పటికే ఏర్పాటు చేసిన ఇతర విగ్రహాలకు అనుమతులు ఉన్నాయా? అనే అంశంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరారు. ప్రస్తుతం దశదిన కార్యక్రమం ఉన్నందున తాత్కాలికంగా ధర్నా విరమిస్తున్నట్లు తెలిపారు. రెండు రోజుల్లోగా బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి