Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నాగల్‌గిద్దలో ప్రజా సమస్యలపై కార్మిక, రైతు సంఘాల జైల్‌భరో పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 10, 2026 09:12 PM

నాగల్‌గిద్దలో ప్రజా సమస్యలపై కార్మిక, రైతు సంఘాల జైల్‌భరో

నాగల్‌గిద్దలో ప్రజా సమస్యలపై కార్మిక, రైతు సంఘాల జైల్‌భరో

నాగల్‌గిద్దలో ప్రజా సమస్యలపై కార్మిక, రైతు సంఘాల జైల్‌భరో
10-08-2026 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

దేశవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాల ఆధ్వర్యంలో నాగల్‌గిద్ద మండల కేంద్రంలో జైల్‌భరో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయగా, పోలీసులు నిరసనలో పాల్గొన్న నాయకులను అరెస్టు చేశారు. కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కొఠారి నర్సింలు, సీఐటీయూ మండల నాయకులు గణపతి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీల హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు. 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చడం కార్మికుల హక్కులకు విరుద్ధమని అన్నారు.పెరుగుతున్న గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలతో పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, నిరుద్యోగ సమస్యను పరిష్కరించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేసి కూలీలకు నిరంతర ఉపాధి కల్పించాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న నాయకులను అరెస్టు చేయడం సరికాదని, అక్రమ అరెస్టులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు నిర్మలా, సంగీత, సవిత, సురేఖ, జ్యోతి, అల్‌వేణి, విద్యావతి, రుక్మిణి, తూకారం, సాయి, దాస్, రాజు, రాములు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నాగల్‌గిద్దలో ప్రజా సమస్యలపై కార్మిక, రైతు సంఘాల జైల్‌భరో

Article Image

దేశవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాల ఆధ్వర్యంలో నాగల్‌గిద్ద మండల కేంద్రంలో జైల్‌భరో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయగా, పోలీసులు నిరసనలో పాల్గొన్న నాయకులను అరెస్టు చేశారు. కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కొఠారి నర్సింలు, సీఐటీయూ మండల నాయకులు గణపతి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీల హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు. 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చడం కార్మికుల హక్కులకు విరుద్ధమని అన్నారు.పెరుగుతున్న గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలతో పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, నిరుద్యోగ సమస్యను పరిష్కరించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేసి కూలీలకు నిరంతర ఉపాధి కల్పించాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న నాయకులను అరెస్టు చేయడం సరికాదని, అక్రమ అరెస్టులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు నిర్మలా, సంగీత, సవిత, సురేఖ, జ్యోతి, అల్‌వేణి, విద్యావతి, రుక్మిణి, తూకారం, సాయి, దాస్, రాజు, రాములు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News