అబ్దుల్లాపూర్మెట్లో నిరసన.. భారీగా పాల్గొన్న కార్మికులు
అబ్దుల్లాపూర్మెట్, ఆగస్టు 10:
కార్మికుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సోమవారం అబ్దుల్లాపూర్మెట్ మండలంలో జైల్భరో కార్యక్రమం నిర్వహించారు. రావి నారాయణరెడ్డి కాలనీ-2లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే విగ్రహాల వద్ద ఈ కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కామ్రేడ్ ముత్యాల యాదిరెడ్డి, ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పబ్బతి లక్ష్మణ్ తదితరులు పాల్గొని కార్మికుల సమస్యలపై తమ గళం వినిపించారు. కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాటాలను కొనసాగిస్తామని నాయకులు తెలిపారు.కార్యక్రమంలో సీపీఐ, ఏఐటీయూసీ అబ్దుల్లాపూర్మెట్ మండల కార్యదర్శి అజ్మీర హరిసింగ్ నాయక్, బీఓసీ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి ప్రసాద్, గిరిజన సమైక్య రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బానోత్ బిక్షం నాయక్తో పాటు బీఓసీ నాయకులు డావుల రాములు, మంగళపల్లి రవి, ఆవుల యాదగిరి, ఆటో రాములు, ఆనంద్, బాల్రెడ్డి, నారాయణ, గోపాల్, వెంకటేష్, శంకర్, పుల్లయ్య, కురుమయ్య తదితర కార్మికులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి