Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నాగల్‌గిద్దలో ప్రజా సమస్యలపై కార్మిక, రైతు సంఘాల జైల్‌భరో పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 10, 2026 08:08 PM

కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ జైల్‌భరో

కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ జైల్‌భరో

కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ జైల్‌భరో
10-08-2026 14 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అబ్దుల్లాపూర్‌మెట్‌లో నిరసన.. భారీగా పాల్గొన్న కార్మికులు

అబ్దుల్లాపూర్‌మెట్, ఆగస్టు 10:

కార్మికుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సోమవారం అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో జైల్‌భరో కార్యక్రమం నిర్వహించారు. రావి నారాయణరెడ్డి కాలనీ-2లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్, జ్యోతిరావు పూలే విగ్రహాల వద్ద ఈ కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కామ్రేడ్ ముత్యాల యాదిరెడ్డి, ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పబ్బతి లక్ష్మణ్‌ తదితరులు పాల్గొని కార్మికుల సమస్యలపై తమ గళం వినిపించారు. కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాటాలను కొనసాగిస్తామని నాయకులు తెలిపారు.కార్యక్రమంలో సీపీఐ, ఏఐటీయూసీ అబ్దుల్లాపూర్‌మెట్ మండల కార్యదర్శి అజ్మీర హరిసింగ్‌ నాయక్, బీఓసీ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి ప్రసాద్, గిరిజన సమైక్య రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బానోత్‌ బిక్షం నాయక్‌తో పాటు బీఓసీ నాయకులు డావుల రాములు, మంగళపల్లి రవి, ఆవుల యాదగిరి, ఆటో రాములు, ఆనంద్, బాల్‌రెడ్డి, నారాయణ, గోపాల్, వెంకటేష్, శంకర్, పుల్లయ్య, కురుమయ్య తదితర కార్మికులు పాల్గొన్నారు.

Sthanikam

కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ జైల్‌భరో

Article Image

అబ్దుల్లాపూర్‌మెట్‌లో నిరసన.. భారీగా పాల్గొన్న కార్మికులు

అబ్దుల్లాపూర్‌మెట్, ఆగస్టు 10:

కార్మికుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సోమవారం అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో జైల్‌భరో కార్యక్రమం నిర్వహించారు. రావి నారాయణరెడ్డి కాలనీ-2లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్, జ్యోతిరావు పూలే విగ్రహాల వద్ద ఈ కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కామ్రేడ్ ముత్యాల యాదిరెడ్డి, ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పబ్బతి లక్ష్మణ్‌ తదితరులు పాల్గొని కార్మికుల సమస్యలపై తమ గళం వినిపించారు. కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాటాలను కొనసాగిస్తామని నాయకులు తెలిపారు.కార్యక్రమంలో సీపీఐ, ఏఐటీయూసీ అబ్దుల్లాపూర్‌మెట్ మండల కార్యదర్శి అజ్మీర హరిసింగ్‌ నాయక్, బీఓసీ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి ప్రసాద్, గిరిజన సమైక్య రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బానోత్‌ బిక్షం నాయక్‌తో పాటు బీఓసీ నాయకులు డావుల రాములు, మంగళపల్లి రవి, ఆవుల యాదగిరి, ఆటో రాములు, ఆనంద్, బాల్‌రెడ్డి, నారాయణ, గోపాల్, వెంకటేష్, శంకర్, పుల్లయ్య, కురుమయ్య తదితర కార్మికులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News