Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రైల్వే సాధన ఉద్యమానికి ఆర్యవైశ్యుల మద్దతు పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 10, 2026 11:22 PM

రైల్వే సాధన ఉద్యమానికి ఆర్యవైశ్యుల మద్దతు

రైల్వే సాధన ఉద్యమానికి ఆర్యవైశ్యుల మద్దతు

రైల్వే సాధన ఉద్యమానికి ఆర్యవైశ్యుల మద్దతు
10-08-2026 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేటకు రైల్వే మార్గం ఏర్పాటు చేయడం జిల్లా ప్రజల చిరకాల కోరిక అని, అది సాకారమయ్యే వరకు శాంతియుతంగా పోరాటాలు కొనసాగిస్తామని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నాయకుడు బండారు రాజా తెలిపారు. సూర్యాపేటకు మొదట కేటాయించిన బుల్లెట్‌ రైలు అలైన్‌మెంట్‌ను పునరుద్ధరించాలని కోరుతూ ఉద్యమిస్తున్న రైల్వే సాధన సమితి నాయకులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన సందర్భంగా ముందస్తుగా అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

రైల్వే కోసం పోరాడుతున్న నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం సరికాదన్నారు. శంషాబాద్‌ నుంచి సూర్యాపేట, అమరావతి మీదుగా చెన్నైకి వెళ్లాల్సిన రైలు మార్గాన్ని ఎందుకు మార్చాల్సి వచ్చిందో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు వివరించాలని డిమాండ్‌ చేశారు. సూర్యాపేట మీదుగా రైల్వే మార్గం ఏర్పాటైతే ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. నాయకులను అరెస్టు చేసినంత మాత్రాన రైల్వే సాధన ఉద్యమాన్ని ఆపలేరని, రైల్వే సాధన సమితి చేస్తున్న ఉద్యమానికి ఆర్యవైశ్యుల సంపూర్ణ మద్దతు ఉంటుందని బండారు రాజా తెలిపారు.

Sthanikam

రైల్వే సాధన ఉద్యమానికి ఆర్యవైశ్యుల మద్దతు

Article Image

సూర్యాపేటకు రైల్వే మార్గం ఏర్పాటు చేయడం జిల్లా ప్రజల చిరకాల కోరిక అని, అది సాకారమయ్యే వరకు శాంతియుతంగా పోరాటాలు కొనసాగిస్తామని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నాయకుడు బండారు రాజా తెలిపారు. సూర్యాపేటకు మొదట కేటాయించిన బుల్లెట్‌ రైలు అలైన్‌మెంట్‌ను పునరుద్ధరించాలని కోరుతూ ఉద్యమిస్తున్న రైల్వే సాధన సమితి నాయకులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన సందర్భంగా ముందస్తుగా అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

రైల్వే కోసం పోరాడుతున్న నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం సరికాదన్నారు. శంషాబాద్‌ నుంచి సూర్యాపేట, అమరావతి మీదుగా చెన్నైకి వెళ్లాల్సిన రైలు మార్గాన్ని ఎందుకు మార్చాల్సి వచ్చిందో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు వివరించాలని డిమాండ్‌ చేశారు. సూర్యాపేట మీదుగా రైల్వే మార్గం ఏర్పాటైతే ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. నాయకులను అరెస్టు చేసినంత మాత్రాన రైల్వే సాధన ఉద్యమాన్ని ఆపలేరని, రైల్వే సాధన సమితి చేస్తున్న ఉద్యమానికి ఆర్యవైశ్యుల సంపూర్ణ మద్దతు ఉంటుందని బండారు రాజా తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News