నార్కట్పల్లిలో బీజేపీ ఆమరణ నిరాహార దీక్షకు బ్రేక్.. ఉద్రిక్తత.
నార్కట్పల్లి: రోడ్డు విస్తరణ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ నార్కట్పల్లి మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు మంగళవారం భగ్నం చేశారు. రోడ్డు విస్తరణ పనులు నత్తనడకన సాగుతుండటంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు.
దీక్ష కొనసాగుతున్న సమయంలో పోలీసులు దీక్షా శిబిరం వద్దకు చేరుకున్నారు. దీక్షలో కూర్చున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలను అక్కడి నుంచి తరలించారు. దీంతో కొద్దిసేపు దీక్షా ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
పోరాటం ఆగదు.
ప్రజల సమస్య పరిష్కారం కోసం శాంతియుతంగా చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేయడం సరికాదని బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు విస్తరణ పనులు పూర్తయ్యే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నా అధికారులు స్పందించకపోవడం బాధాకరమని వారు పేర్కొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి