ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఆహ్వానం అందించిన ఆలయ కమిటీ
చౌటుప్పల్ భవానీ నగర్లోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని ఆలయ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలసి ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ బొబ్బిళ్ళ మురళి గురుస్వామి మాట్లాడుతూ.. త్వరలో జరగబోయే ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ పురపాలక వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్, కో-ఆప్షన్ సభ్యులు పస్తం గంగ రాములు, నూతనంగా ఎన్నికైన ధర్మకర్తలు వర్కల రవి గౌడ్, ఆవుల యేసు యాదవ్, దాడి యశ్వంత్ రెడ్డి, గగులోతు అరుణ నాయక్, బొబ్బిళ్ళ సామ్రాట్ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి