విద్యార్థులకు దుస్తుల పంపిణీ.. ఇందిరమ్మ ఇండ్ల పరిశీలన
మండల పరిధిలోని పంతంగి గ్రామంలో జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (జడ్పీ సీఈఓ) శోభారాణి మంగళవారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించి, విద్యార్థినీ విద్యార్థులకు ఉచిత స్కూల్ యూనిఫారమ్ పంపిణీ చేశారు. అనంతరం పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. పాఠశాల పర్యటన అనంతరం గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను సీఈఓ పరిశీలించారు. పూర్తయిన గృహాలను పరిశీలించడంతో పాటు, ఇంకా నిర్మాణంలో ఉన్న పెండింగ్ ఇండ్ల వివరాలను సంబంధిత హౌసింగ్ ఏఈని అడిగి తెలుసుకున్నారు. పనులను త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) శ్రీలత, గ్రామ సర్పంచ్ శ్రీలత సుందర్, పంచాయతీ కార్యదర్శి పద్మజ, హౌసింగ్ ఏఈ పవన్ కళ్యాణ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ, ఉపాధ్యాయులు,విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి