భువనగిరి పట్టణంలోని కిసాన్నగర్లో ఈనెల 22, 23 తేదీల్లో నిర్వహించనున్న బోనాల పండుగను పురస్కరించుకుని పెద్దమ్మగుడి రంగుల కోసం పల్లెపాటి నాగరాజు రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేశారు. మంగళవారం ముదిరాజ్ బోనాల ఉత్సవ కమిటీ సభ్యులకు ఈ మొత్తాన్ని అందించారు.
ఈ సందర్భంగా పల్లెపాటి నాగరాజు మాట్లాడుతూ.. భవిష్యత్లో చేపట్టనున్న పెద్దమ్మగుడి పునర్నిర్మాణానికి కూడా తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు. పట్టణంలోని ముదిరాజులంతా సామూహికంగా పాల్గొని బోనాల పండుగను విజయవంతం చేయాలని కోరారు.
కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కుక్కదూగు సోమయ్య, దేవాలయ అభివృద్ధి కమిటీ జిల్లా అధ్యక్షులు తుపాకుల శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్ట్ కొలుపుల వివేకానంద, ముదిరాజ్ సంఘం పట్టణ ప్రధాన కార్యదర్శి నీల శ్రీనివాస్, ముదిరాజ్ బోనాల ఉత్సవ కమిటీ కన్వీనర్ గుర్రాల శివనాగేందర్ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి