Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జహీరాబాద్ మీదుగా బుల్లెట్ ట్రైన్.. ఎంపీ పట్టుదల రైల్వే మంత్రికి వినతిపత్రం.. అసలు ప్రతిపాదిత రూట్ కొనసాగింపునకు డిమాండ్ పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 11, 2026 08:09 PM

బంజారా సేవా దళ్‌కు నూతన రాష్ట్ర కమిటీ.. అధ్యక్షుడిగా రఘురాం రాథోడ్

బంజారా సేవా దళ్‌కు నూతన రాష్ట్ర కమిటీ.. అధ్యక్షుడిగా రఘురాం రాథోడ్

బంజారా సేవా దళ్‌కు నూతన రాష్ట్ర కమిటీ.. అధ్యక్షుడిగా రఘురాం రాథోడ్
11-08-2026 62 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

మహారాష్ట్రలోని పవిత్రమైన పోహరాఘడ్ మరెమ్మ యాడి దేవాలయం, సేవాలాల్ మహారాజ్ మఠంలో బంజారా సేవా దళ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఏర్పాటు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. బంజారా సేవా దళ్ వ్యవస్థాపక అధ్యక్షులు నేనావత్ అజయ్ నాయక్, పోహరాఘడ్ పీఠాధిపతి శేఖర్ మహారాజ్, గౌరవ అధ్యక్షులు రామ్‌చందర్ నాయక్ తదితరుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి సుమారు 150 మంది బంజారా సేవా దళ్ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడిగా రఘురాం రాథోడ్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా అశోక్ రాథోడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన నాయకులకు పీఠాధిపతి శేఖర్ మహారాజ్ కండువాలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నాయకులు మరెమ్మ యాడి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బంజారా సమాజ ఐక్యత, హక్కులు, ఆత్మగౌరవం, అభివృద్ధి కోసం బంజారా సేవా దళ్ నిరంతరం కృషి చేస్తుందని వ్యవస్థాపక అధ్యక్షులు నేనావత్ అజయ్ నాయక్ తెలిపారు. తెలంగాణలోని మైదాన ప్రాంత గిరిజనులకు ఎలాంటి అన్యాయం జరిగినా వారి పక్షాన నిలబడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నూతన రాష్ట్ర అధ్యక్షుడు రఘురాం రాథోడ్ పేర్కొన్నారు.

Sthanikam

బంజారా సేవా దళ్‌కు నూతన రాష్ట్ర కమిటీ.. అధ్యక్షుడిగా రఘురాం రాథోడ్

Article Image

మహారాష్ట్రలోని పవిత్రమైన పోహరాఘడ్ మరెమ్మ యాడి దేవాలయం, సేవాలాల్ మహారాజ్ మఠంలో బంజారా సేవా దళ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఏర్పాటు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. బంజారా సేవా దళ్ వ్యవస్థాపక అధ్యక్షులు నేనావత్ అజయ్ నాయక్, పోహరాఘడ్ పీఠాధిపతి శేఖర్ మహారాజ్, గౌరవ అధ్యక్షులు రామ్‌చందర్ నాయక్ తదితరుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి సుమారు 150 మంది బంజారా సేవా దళ్ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడిగా రఘురాం రాథోడ్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా అశోక్ రాథోడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన నాయకులకు పీఠాధిపతి శేఖర్ మహారాజ్ కండువాలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నాయకులు మరెమ్మ యాడి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బంజారా సమాజ ఐక్యత, హక్కులు, ఆత్మగౌరవం, అభివృద్ధి కోసం బంజారా సేవా దళ్ నిరంతరం కృషి చేస్తుందని వ్యవస్థాపక అధ్యక్షులు నేనావత్ అజయ్ నాయక్ తెలిపారు. తెలంగాణలోని మైదాన ప్రాంత గిరిజనులకు ఎలాంటి అన్యాయం జరిగినా వారి పక్షాన నిలబడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నూతన రాష్ట్ర అధ్యక్షుడు రఘురాం రాథోడ్ పేర్కొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News