ధర్మోజిగూడెంలో ఇంకుడు గుంతల నిర్మాణానికి శంకుస్థాపన
భూగర్భ జల సంరక్షణ కోసమే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జలసిరి’ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఇంకుడు గుంతల నిర్మాణం చేపడుతున్నామని ధర్మోజిగూడెం సర్పంచ్ జువ్వి నర్సింహ్మ తెలిపారు. చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెం గ్రామంలో బుధవారం ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని ఇంకుడు గుంత నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ... వర్షపు నీరు వృథాగా పోకుండా నిల్వ చేసేందుకు, భూగర్భ నీటి మట్టాలను పెంపొందించేందుకు ఇంకుడు గుంతలు ఎంతగానో దోహదపడతాయన్నారు. గ్రామాల్లో నీటి కొరత తీరాలంటే భూగర్భ జలాలు పెరగాలని, అది ఒక్క ఇంకుడు గుంతలతోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. గ్రామంలోని ప్రజలందరూ ముందుకు వచ్చి సాధ్యమైనంత వరకు ఇంకుడు గుంతలను నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు సామిడి సంధ్య, ఐతరాజు శారద, రాచకొండ భార్గవ్, జీడిముడ్ల శోభ, గునుగంటి వెంకటేశం, పంచాయతీ కార్యదర్శి సుధాకర్, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి