Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్‌కు నీటి వసతులే ప్రథమ ప్రాధాన్యం: ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 11, 2026 09:24 PM

భూగర్భ జల సంరక్షణకే ‘జలసిరి’ : సర్పంచ్ జువ్వి నర్సింహ్మ

భూగర్భ జల సంరక్షణకే ‘జలసిరి’ : సర్పంచ్ జువ్వి నర్సింహ్మ

భూగర్భ జల సంరక్షణకే ‘జలసిరి’ : సర్పంచ్ జువ్వి నర్సింహ్మ
11-08-2026 11 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ధర్మోజిగూడెంలో ఇంకుడు గుంతల నిర్మాణానికి శంకుస్థాపన

భూగర్భ జల సంరక్షణ కోసమే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జలసిరి’ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఇంకుడు గుంతల నిర్మాణం చేపడుతున్నామని ధర్మోజిగూడెం సర్పంచ్ జువ్వి నర్సింహ్మ తెలిపారు. చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెం గ్రామంలో బుధవారం ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని ఇంకుడు గుంత నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ​ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ... వర్షపు నీరు వృథాగా పోకుండా నిల్వ చేసేందుకు, భూగర్భ నీటి మట్టాలను పెంపొందించేందుకు ఇంకుడు గుంతలు ఎంతగానో దోహదపడతాయన్నారు. గ్రామాల్లో నీటి కొరత తీరాలంటే భూగర్భ జలాలు పెరగాలని, అది ఒక్క ఇంకుడు గుంతలతోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. గ్రామంలోని ప్రజలందరూ ముందుకు వచ్చి సాధ్యమైనంత వరకు ఇంకుడు గుంతలను నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు సామిడి సంధ్య, ఐతరాజు శారద, రాచకొండ భార్గవ్, జీడిముడ్ల శోభ, గునుగంటి వెంకటేశం, పంచాయతీ కార్యదర్శి సుధాకర్, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

భూగర్భ జల సంరక్షణకే ‘జలసిరి’ : సర్పంచ్ జువ్వి నర్సింహ్మ

Article Image

ధర్మోజిగూడెంలో ఇంకుడు గుంతల నిర్మాణానికి శంకుస్థాపన

భూగర్భ జల సంరక్షణ కోసమే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జలసిరి’ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఇంకుడు గుంతల నిర్మాణం చేపడుతున్నామని ధర్మోజిగూడెం సర్పంచ్ జువ్వి నర్సింహ్మ తెలిపారు. చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెం గ్రామంలో బుధవారం ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని ఇంకుడు గుంత నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ​ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ... వర్షపు నీరు వృథాగా పోకుండా నిల్వ చేసేందుకు, భూగర్భ నీటి మట్టాలను పెంపొందించేందుకు ఇంకుడు గుంతలు ఎంతగానో దోహదపడతాయన్నారు. గ్రామాల్లో నీటి కొరత తీరాలంటే భూగర్భ జలాలు పెరగాలని, అది ఒక్క ఇంకుడు గుంతలతోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. గ్రామంలోని ప్రజలందరూ ముందుకు వచ్చి సాధ్యమైనంత వరకు ఇంకుడు గుంతలను నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు సామిడి సంధ్య, ఐతరాజు శారద, రాచకొండ భార్గవ్, జీడిముడ్ల శోభ, గునుగంటి వెంకటేశం, పంచాయతీ కార్యదర్శి సుధాకర్, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News