1930కు ఫిర్యాదు చేయండి..
రామన్నపేట సీఐ మోలుగూరి రవి.
ప్రజలకు అవగాహన కల్పించిన ఎస్ఐ గోపాతి సతీష్.
సైబర్ నేరగాళ్ల వలలో పడి మోసపోవద్దని రామన్నపేట సీఐ మోలుగూరి రవి ప్రజలకు సూచించారు. సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు మంగళవారం రామన్నపేటలో పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీఐ మోలుగూరి రవి ఆధ్వర్యంలో ఎస్ఐ గోపాతి సతీష్ ప్రజలకు సైబర్ మోసాలపై వివరించారు.
ఆన్లైన్ మోసాలు, అనుమానాస్పద ఫోన్కాల్స్, మెసేజ్లు, లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం పిన్, ఓటీపీ వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ వెల్లడించవద్దని తెలిపారు. సైబర్ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.
ప్రజల్లో సైబర్ నేరాలపై అవగాహన పెంచడంతో పాటు, నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసుల సూచనలు పాటించాలని సీఐ మోలుగూరి రవి, ఎస్ఐ గోపాతి సతీష్ కోరారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి