నల్లగొండ : నల్లగొండ జిల్లా ప్రభుత్వ సర్వజన వైద్యాశాల (జీజీహెచ్) ప్రాంగణంలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఓ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆసుపత్రిలో ప్రసవించిన ఓ బాలింత అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకొని మృతిచెందింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... మునుగోడు మండలం చీకటిమామిడి గ్రామానికి చెందిన మమత (27) ప్రసవం కోసం ఎనిమిది రోజుల క్రితం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చేరింది. కాగా, ఆమెకు ఇప్పటికే ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. ఇటీవల జరిగిన ప్రసవంలో మమత మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగానే ఉండటంతో ఆసుపత్రిలోని బాలింతల వార్డులోనే చికిత్స పొందుతున్నారు. అయితే, బుధవారం తెల్లవారుజామున మమత ఎవరికీ చెప్పకుండా వార్డు నుంచి బయటకు వచ్చింది. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆసుపత్రి ప్రాంగణంలో మార్చురి వద్ద ఉరి వేసుకొని మృతి చెంది నిర్జీవంగా పడి ఉండటాన్ని గమనించిన సిబ్బంది, రోగుల బంధువులు దిగ్భ్రాంతికి గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పంచనామా నిర్వహించారు. మమత మృతికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, కుటుంబ సభ్యులతో పాటు ఆసుపత్రి సిబ్బంది, వైద్యులను విచారిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక, పోలీసుల పూర్తిస్థాయి దర్యాప్తు అనంతరమే ఈ ఘటనపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం: ప్రసవించిన బాలింత అనుమానాస్పద మృతి..
నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం: ప్రసవించిన బాలింత అనుమానాస్పద మృతి..
NM Yadav
నల్లగొండ : నల్లగొండ జిల్లా ప్రభుత్వ సర్వజన వైద్యాశాల (జీజీహెచ్) ప్రాంగణంలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఓ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆసుపత్రిలో ప్రసవించిన ఓ బాలింత అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకొని మృతిచెందింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... మునుగోడు మండలం చీకటిమామిడి గ్రామానికి చెందిన మమత (27) ప్రసవం కోసం ఎనిమిది రోజుల క్రితం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చేరింది. కాగా, ఆమెకు ఇప్పటికే ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. ఇటీవల జరిగిన ప్రసవంలో మమత మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగానే ఉండటంతో ఆసుపత్రిలోని బాలింతల వార్డులోనే చికిత్స పొందుతున్నారు. అయితే, బుధవారం తెల్లవారుజామున మమత ఎవరికీ చెప్పకుండా వార్డు నుంచి బయటకు వచ్చింది. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆసుపత్రి ప్రాంగణంలో మార్చురి వద్ద ఉరి వేసుకొని మృతి చెంది నిర్జీవంగా పడి ఉండటాన్ని గమనించిన సిబ్బంది, రోగుల బంధువులు దిగ్భ్రాంతికి గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పంచనామా నిర్వహించారు. మమత మృతికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, కుటుంబ సభ్యులతో పాటు ఆసుపత్రి సిబ్బంది, వైద్యులను విచారిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక, పోలీసుల పూర్తిస్థాయి దర్యాప్తు అనంతరమే ఈ ఘటనపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి