*లింగోజిగూడెం 'సవారియా' కంపెనీలో సైబర్ అవగాహన సదస్సు
సమాజంలో రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ నిరంతరం అప్రమత్తంగా ఉండాలని చౌటుప్పల్ సీఐ జి. మన్మథ కుమార్ సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో మంగళవారం మండలంలోని లింగోజిగూడెం గ్రామంలో గల 'సవారియా' కంపెనీలో సైబర్ భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన సీఐ మాట్లాడుతూ.. మోసగాళ్ల వలలో పడి నిలువునా మునిగిపోవద్దని హెచ్చరించారు. గుర్తుతెలియని వ్యక్తులకు ఓటీపీ (OTP), పిన్, సీవీవీ, పాస్వర్డ్లు, బ్యాంక్ వివరాలు ఎట్టిపరిస్థితుల్లోనూ చెప్పకూడదు. ఆన్లైన్ పెట్టుబడులు, పార్ట్టైమ్ ఉద్యోగాలు, రివార్డులు, తక్కువ వడ్డీకే లోన్ల పేరిట వచ్చే అనుమానాస్పద లింకులు, మెసేజ్లు, కాల్స్కు స్పందించవద్దు. యుపిఐ (UPI) ద్వారా నగదు బదిలీ చేసేముందు వివరాలను ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలి.
ఆలస్యం చేయకుండా 1930కి ఫిర్యాదు చేయండి
ఒకవేళ సైబర్ మోసానికి గురైతే లేదా అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు గమనిస్తే వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నంబరుకు బాధితులు సమాచారం అందించాలని సీఐ తెలిపారు. ప్రజలందరూ పోలీసులకు సహకరిస్తూ సైబర్ భద్రతపై ప్రతి ఒక్కరినీ చైతన్యపరచాలని కోరారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి