Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఆన్‌లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సీఐ మన్మథ కుమార్ ​ పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 12, 2026 07:14 AM

ఆన్‌లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సీఐ మన్మథ కుమార్ ​

ఆన్‌లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సీఐ మన్మథ కుమార్ ​

ఆన్‌లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సీఐ మన్మథ కుమార్ ​
12-08-2026 8 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

*లింగోజిగూడెం 'సవారియా' కంపెనీలో సైబర్ అవగాహన సదస్సు

సమాజంలో రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ నిరంతరం అప్రమత్తంగా ఉండాలని చౌటుప్పల్ సీఐ జి. మన్మథ కుమార్ సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో మంగళవారం మండలంలోని లింగోజిగూడెం గ్రామంలో గల 'సవారియా' కంపెనీలో సైబర్ భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ​ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన సీఐ మాట్లాడుతూ.. మోసగాళ్ల వలలో పడి నిలువునా మునిగిపోవద్దని హెచ్చరించారు. గుర్తుతెలియని వ్యక్తులకు ఓటీపీ (OTP), పిన్, సీవీవీ, పాస్‌వర్డ్‌లు, బ్యాంక్ వివరాలు ఎట్టిపరిస్థితుల్లోనూ చెప్పకూడదు. ఆన్‌లైన్ పెట్టుబడులు, పార్ట్‌టైమ్ ఉద్యోగాలు, రివార్డులు, తక్కువ వడ్డీకే లోన్ల పేరిట వచ్చే అనుమానాస్పద లింకులు, మెసేజ్‌లు, కాల్స్‌కు స్పందించవద్దు. యుపిఐ (UPI) ద్వారా నగదు బదిలీ చేసేముందు వివరాలను ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలి.

​ఆలస్యం చేయకుండా 1930కి ఫిర్యాదు చేయండి

ఒకవేళ సైబర్ మోసానికి గురైతే లేదా అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు గమనిస్తే వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబరుకు బాధితులు సమాచారం అందించాలని సీఐ తెలిపారు. ప్రజలందరూ పోలీసులకు సహకరిస్తూ సైబర్ భద్రతపై ప్రతి ఒక్కరినీ చైతన్యపరచాలని కోరారు.

Sthanikam

ఆన్‌లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సీఐ మన్మథ కుమార్ ​

Article Image

*లింగోజిగూడెం 'సవారియా' కంపెనీలో సైబర్ అవగాహన సదస్సు

సమాజంలో రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ నిరంతరం అప్రమత్తంగా ఉండాలని చౌటుప్పల్ సీఐ జి. మన్మథ కుమార్ సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో మంగళవారం మండలంలోని లింగోజిగూడెం గ్రామంలో గల 'సవారియా' కంపెనీలో సైబర్ భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ​ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన సీఐ మాట్లాడుతూ.. మోసగాళ్ల వలలో పడి నిలువునా మునిగిపోవద్దని హెచ్చరించారు. గుర్తుతెలియని వ్యక్తులకు ఓటీపీ (OTP), పిన్, సీవీవీ, పాస్‌వర్డ్‌లు, బ్యాంక్ వివరాలు ఎట్టిపరిస్థితుల్లోనూ చెప్పకూడదు. ఆన్‌లైన్ పెట్టుబడులు, పార్ట్‌టైమ్ ఉద్యోగాలు, రివార్డులు, తక్కువ వడ్డీకే లోన్ల పేరిట వచ్చే అనుమానాస్పద లింకులు, మెసేజ్‌లు, కాల్స్‌కు స్పందించవద్దు. యుపిఐ (UPI) ద్వారా నగదు బదిలీ చేసేముందు వివరాలను ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలి.

​ఆలస్యం చేయకుండా 1930కి ఫిర్యాదు చేయండి

ఒకవేళ సైబర్ మోసానికి గురైతే లేదా అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు గమనిస్తే వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబరుకు బాధితులు సమాచారం అందించాలని సీఐ తెలిపారు. ప్రజలందరూ పోలీసులకు సహకరిస్తూ సైబర్ భద్రతపై ప్రతి ఒక్కరినీ చైతన్యపరచాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News