సీఎంఆర్ బియ్యం పక్కదారి పట్టించారనే ఆరోపణలపై ఆరా.. పాత రికార్డుల పరిశీలన.
రామన్నపేట: మండలంలోని తుమ్మలగూడెం (ఇంద్రపాలనగరం) గ్రామంలోని శ్రీ విద్య రైస్మిల్లుపై విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) బియ్యం పక్కదారి పట్టించారనే ఆరోపణల నేపథ్యంలో అధికారులు మిల్లులోని రికార్డులను పరిశీలించినట్లు తెలిసింది.
2023 సంవత్సరం నుంచి రైస్మిల్లు పేరు మార్పు, సీఎంఆర్ బియ్యం కేటాయింపులు, మిల్లింగ్ వివరాలు, బియ్యం నిల్వలు తదితర అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంలో అప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన లావాదేవీలు, సంబంధిత రికార్డులను పరిశీలించడంతో పాటు అధికారుల పాత్రపై కూడా వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది.సీఎంఆర్ బియ్యం పక్కదారి పట్టించారనే ఆరోపణల్లో వాస్తవమెంత? రికార్డుల్లో ఏమైనా అవకతవకలు చోటుచేసుకున్నాయా? అనే అంశాలపై విజిలెన్స్ అధికారులు సమగ్రంగా విచారణ చేస్తున్నట్లు సమాచారం. అయితే పూర్తి స్థాయి విచారణ అనంతరం మాత్రమే అసలు విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. అధికారికంగా నివేదిక వెలువడిన తర్వాతే ఈ వ్యవహారంపై స్పష్టత రానుంది.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి