Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఆన్‌లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సీఐ మన్మథ కుమార్ ​ పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 12, 2026 07:06 AM

రైస్‌మిల్లుపై విజిలెన్స్‌ అధికారుల తనిఖీలు

రైస్‌మిల్లుపై విజిలెన్స్‌ అధికారుల తనిఖీలు

రైస్‌మిల్లుపై విజిలెన్స్‌ అధికారుల తనిఖీలు
12-08-2026 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

సీఎంఆర్‌ బియ్యం పక్కదారి పట్టించారనే ఆరోపణలపై ఆరా.. పాత రికార్డుల పరిశీలన.


రామన్నపేట: మండలంలోని తుమ్మలగూడెం (ఇంద్రపాలనగరం) గ్రామంలోని శ్రీ విద్య రైస్‌మిల్లుపై విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. సీఎంఆర్‌ (కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌) బియ్యం పక్కదారి పట్టించారనే ఆరోపణల నేపథ్యంలో అధికారులు మిల్లులోని రికార్డులను పరిశీలించినట్లు తెలిసింది.

2023 సంవత్సరం నుంచి రైస్‌మిల్లు పేరు మార్పు, సీఎంఆర్‌ బియ్యం కేటాయింపులు, మిల్లింగ్‌ వివరాలు, బియ్యం నిల్వలు తదితర అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంలో అప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన లావాదేవీలు, సంబంధిత రికార్డులను పరిశీలించడంతో పాటు అధికారుల పాత్రపై కూడా వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది.సీఎంఆర్‌ బియ్యం పక్కదారి పట్టించారనే ఆరోపణల్లో వాస్తవమెంత? రికార్డుల్లో ఏమైనా అవకతవకలు చోటుచేసుకున్నాయా? అనే అంశాలపై విజిలెన్స్‌ అధికారులు సమగ్రంగా విచారణ చేస్తున్నట్లు సమాచారం. అయితే పూర్తి స్థాయి విచారణ అనంతరం మాత్రమే అసలు విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. అధికారికంగా నివేదిక వెలువడిన తర్వాతే ఈ వ్యవహారంపై స్పష్టత రానుంది.


Sthanikam

రైస్‌మిల్లుపై విజిలెన్స్‌ అధికారుల తనిఖీలు

Article Image

సీఎంఆర్‌ బియ్యం పక్కదారి పట్టించారనే ఆరోపణలపై ఆరా.. పాత రికార్డుల పరిశీలన.


రామన్నపేట: మండలంలోని తుమ్మలగూడెం (ఇంద్రపాలనగరం) గ్రామంలోని శ్రీ విద్య రైస్‌మిల్లుపై విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. సీఎంఆర్‌ (కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌) బియ్యం పక్కదారి పట్టించారనే ఆరోపణల నేపథ్యంలో అధికారులు మిల్లులోని రికార్డులను పరిశీలించినట్లు తెలిసింది.

2023 సంవత్సరం నుంచి రైస్‌మిల్లు పేరు మార్పు, సీఎంఆర్‌ బియ్యం కేటాయింపులు, మిల్లింగ్‌ వివరాలు, బియ్యం నిల్వలు తదితర అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంలో అప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన లావాదేవీలు, సంబంధిత రికార్డులను పరిశీలించడంతో పాటు అధికారుల పాత్రపై కూడా వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది.సీఎంఆర్‌ బియ్యం పక్కదారి పట్టించారనే ఆరోపణల్లో వాస్తవమెంత? రికార్డుల్లో ఏమైనా అవకతవకలు చోటుచేసుకున్నాయా? అనే అంశాలపై విజిలెన్స్‌ అధికారులు సమగ్రంగా విచారణ చేస్తున్నట్లు సమాచారం. అయితే పూర్తి స్థాయి విచారణ అనంతరం మాత్రమే అసలు విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. అధికారికంగా నివేదిక వెలువడిన తర్వాతే ఈ వ్యవహారంపై స్పష్టత రానుంది.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News