Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అర్హులైన వారందరికీ పెన్షన్లు ఇవ్వాలి ​– సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు ఎండి పాషా పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 12, 2026 04:46 PM

గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు. రంగనాథన్ సేవలు చిరస్మరణీయం.

గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు. రంగనాథన్ సేవలు చిరస్మరణీయం.

గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు.  రంగనాథన్ సేవలు చిరస్మరణీయం.
12-08-2026 17 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భారత గ్రంథాలయ శాస్త్ర పితామహుడు ఎస్‌.ఆర్‌. రంగనాథన్ జయంతిని పురస్కరించుకుని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ గ్రంథపాలకుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కళాశాల గ్రంథాలయ విభాగం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ప్రిన్సిపాల్‌ ఆచార్య రాహత్‌ ఖాన్ అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో గ్రంథాలయాల స్థాపన, అభివృద్ధి కోసం రంగనాథన్ జీవితాంతం కృషి చేశారని కొనియాడారు. గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని, విద్యార్థులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

గ్రంథపాలకులు డాక్టర్‌ రాచమళ్ళ శ్రీను మాట్లాడుతూ.. లండన్‌ విశ్వవిద్యాలయంలో గ్రంథాలయ శాస్త్రాన్ని అభ్యసించిన రంగనాథన్‌ భారత్‌కు తిరిగి వచ్చి గ్రంథాలయ శాస్త్ర అభివృద్ధికి విశేష కృషి చేశారని తెలిపారు. ఆయన సేవలు చిరస్మరణీయమన్నారు.

కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపల్‌ ఆచార్య ఆర్‌. రత్నమంజుల, అకడమిక్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ డి. కిషన్‌, ఐక్యూఏసీ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎన్‌. లక్ష్మీనీలిమ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు. రంగనాథన్ సేవలు చిరస్మరణీయం.

Article Image

భారత గ్రంథాలయ శాస్త్ర పితామహుడు ఎస్‌.ఆర్‌. రంగనాథన్ జయంతిని పురస్కరించుకుని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ గ్రంథపాలకుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కళాశాల గ్రంథాలయ విభాగం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ప్రిన్సిపాల్‌ ఆచార్య రాహత్‌ ఖాన్ అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో గ్రంథాలయాల స్థాపన, అభివృద్ధి కోసం రంగనాథన్ జీవితాంతం కృషి చేశారని కొనియాడారు. గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని, విద్యార్థులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

గ్రంథపాలకులు డాక్టర్‌ రాచమళ్ళ శ్రీను మాట్లాడుతూ.. లండన్‌ విశ్వవిద్యాలయంలో గ్రంథాలయ శాస్త్రాన్ని అభ్యసించిన రంగనాథన్‌ భారత్‌కు తిరిగి వచ్చి గ్రంథాలయ శాస్త్ర అభివృద్ధికి విశేష కృషి చేశారని తెలిపారు. ఆయన సేవలు చిరస్మరణీయమన్నారు.

కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపల్‌ ఆచార్య ఆర్‌. రత్నమంజుల, అకడమిక్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ డి. కిషన్‌, ఐక్యూఏసీ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎన్‌. లక్ష్మీనీలిమ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News