భారత గ్రంథాలయ శాస్త్ర పితామహుడు ఎస్.ఆర్. రంగనాథన్ జయంతిని పురస్కరించుకుని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ గ్రంథపాలకుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కళాశాల గ్రంథాలయ విభాగం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ప్రిన్సిపాల్ ఆచార్య రాహత్ ఖాన్ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో గ్రంథాలయాల స్థాపన, అభివృద్ధి కోసం రంగనాథన్ జీవితాంతం కృషి చేశారని కొనియాడారు. గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని, విద్యార్థులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
గ్రంథపాలకులు డాక్టర్ రాచమళ్ళ శ్రీను మాట్లాడుతూ.. లండన్ విశ్వవిద్యాలయంలో గ్రంథాలయ శాస్త్రాన్ని అభ్యసించిన రంగనాథన్ భారత్కు తిరిగి వచ్చి గ్రంథాలయ శాస్త్ర అభివృద్ధికి విశేష కృషి చేశారని తెలిపారు. ఆయన సేవలు చిరస్మరణీయమన్నారు.
కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ ఆచార్య ఆర్. రత్నమంజుల, అకడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ డి. కిషన్, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్. లక్ష్మీనీలిమ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి