Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హెల్మెట్‌ ధరించండి.. సురక్షితంగా ఇంటికి చేరండి. రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం ఎస్‌ఐ గోపాతి సతీష్‌. పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 12, 2026 09:18 PM

దివ్యాంగుడి కుటుంబానికి రూ.40 వేల ఆర్థిక సాయం

దివ్యాంగుడి కుటుంబానికి రూ.40 వేల ఆర్థిక సాయం

దివ్యాంగుడి కుటుంబానికి రూ.40 వేల ఆర్థిక సాయం
12-08-2026 65 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌నగర్ కాలనీకి చెందిన దివ్యాంగుడు ఆదిమల్ల రవికుమార్ అకాల మరణంతో విషాదం నెలకొంది. ఆయన కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు సూర్యాపేట జిల్లా దివ్యాంగుల మిత్రబృందం ఆధ్వర్యంలో జిల్లాలోని దివ్యాంగులు తమ వంతు సహకారం అందించారు.

ఈ సందర్భంగా రవికుమార్ కుటుంబానికి రూ.40 వేల ఆర్థిక సహాయాన్ని మిత్రబృందం సభ్యులు అందజేశారు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారని తెలిపారు. కుటుంబ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తమ వంతు సహాయం అందించి అండగా నిలిచినట్లు మిత్రబృందం సభ్యులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో షేక్ నయీమ్, కొరివి సైదులు, బెంగారపు బిక్షపతి, వీరమల్ల యాదగిరి, కర్నాటి జయకృష్ణ, నల్లెడ మాధవరెడ్డి, యుద్ధ సైదులు, ఏలే జానయ్య, సీఎం సైదులు, ఉప్పేనపల్లి సైదులు, ఎరుకల రవిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

దివ్యాంగుడి కుటుంబానికి రూ.40 వేల ఆర్థిక సాయం

Article Image

జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌నగర్ కాలనీకి చెందిన దివ్యాంగుడు ఆదిమల్ల రవికుమార్ అకాల మరణంతో విషాదం నెలకొంది. ఆయన కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు సూర్యాపేట జిల్లా దివ్యాంగుల మిత్రబృందం ఆధ్వర్యంలో జిల్లాలోని దివ్యాంగులు తమ వంతు సహకారం అందించారు.

ఈ సందర్భంగా రవికుమార్ కుటుంబానికి రూ.40 వేల ఆర్థిక సహాయాన్ని మిత్రబృందం సభ్యులు అందజేశారు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారని తెలిపారు. కుటుంబ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తమ వంతు సహాయం అందించి అండగా నిలిచినట్లు మిత్రబృందం సభ్యులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో షేక్ నయీమ్, కొరివి సైదులు, బెంగారపు బిక్షపతి, వీరమల్ల యాదగిరి, కర్నాటి జయకృష్ణ, నల్లెడ మాధవరెడ్డి, యుద్ధ సైదులు, ఏలే జానయ్య, సీఎం సైదులు, ఉప్పేనపల్లి సైదులు, ఎరుకల రవిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News