Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హెల్మెట్‌ ధరించండి.. సురక్షితంగా ఇంటికి చేరండి. రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం ఎస్‌ఐ గోపాతి సతీష్‌. పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 12, 2026 09:11 PM

ప్రకృతి వ్యవసాయం.. నానో ఎరువులపై రైతులకు అవగాహన

ప్రకృతి వ్యవసాయం.. నానో ఎరువులపై రైతులకు అవగాహన

ప్రకృతి వ్యవసాయం.. నానో ఎరువులపై రైతులకు అవగాహన
12-08-2026 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండలం జామ్గి రైతు వేదికలో ఆత్మ (ATMA) శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 13న రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, సాంకేతికతలపై ప్రత్యేక శిక్షణ నిర్వహించనున్నారు. కేవీకే శాస్త్రవేత్త రమేష్ రైతులకు ఎల్‌నినో ప్రభావ పరిస్థితుల్లో నూనెగింజల పంటల సాగు, ప్రకృతి వ్యవసాయం, నానో యూరియా, నానో డీఏపీ, హెచ్‌డీ కాటన్, అంతర పంటల సాగు, సమగ్ర సస్యరక్షణ తదితర అంశాలపై శాస్త్రీయ అవగాహన కల్పించనున్నారు. ఆధునిక పద్ధతులను పాటించడం ద్వారా సాగు ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు పంట దిగుబడిని పెంచుకోవడం, ఎరువులను సమర్థవంతంగా వినియోగించడం, పురుగు–తెగుళ్లను సమగ్రంగా నియంత్రించడం వంటి అంశాలపై రైతులకు సూచనలు ఇవ్వనున్నారు. ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తక్కువ నీటితో సాగు చేసే పంటలను ప్రోత్సహించడం, పంటల వైవిధ్యీకరణపై కూడా అవగాహన కల్పించనున్నారు. కంగ్టి మండల రైతులు ఈ శిక్షణ కార్యక్రమానికి హాజరై సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ శాఖ అధికారులు కోరారు.ఈ సందర్భంగా మండల వ్యవసాయాధికారి వి. హరీష్ తెలిపారు.

Sthanikam

ప్రకృతి వ్యవసాయం.. నానో ఎరువులపై రైతులకు అవగాహన

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండలం జామ్గి రైతు వేదికలో ఆత్మ (ATMA) శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 13న రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, సాంకేతికతలపై ప్రత్యేక శిక్షణ నిర్వహించనున్నారు. కేవీకే శాస్త్రవేత్త రమేష్ రైతులకు ఎల్‌నినో ప్రభావ పరిస్థితుల్లో నూనెగింజల పంటల సాగు, ప్రకృతి వ్యవసాయం, నానో యూరియా, నానో డీఏపీ, హెచ్‌డీ కాటన్, అంతర పంటల సాగు, సమగ్ర సస్యరక్షణ తదితర అంశాలపై శాస్త్రీయ అవగాహన కల్పించనున్నారు. ఆధునిక పద్ధతులను పాటించడం ద్వారా సాగు ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు పంట దిగుబడిని పెంచుకోవడం, ఎరువులను సమర్థవంతంగా వినియోగించడం, పురుగు–తెగుళ్లను సమగ్రంగా నియంత్రించడం వంటి అంశాలపై రైతులకు సూచనలు ఇవ్వనున్నారు. ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తక్కువ నీటితో సాగు చేసే పంటలను ప్రోత్సహించడం, పంటల వైవిధ్యీకరణపై కూడా అవగాహన కల్పించనున్నారు. కంగ్టి మండల రైతులు ఈ శిక్షణ కార్యక్రమానికి హాజరై సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ శాఖ అధికారులు కోరారు.ఈ సందర్భంగా మండల వ్యవసాయాధికారి వి. హరీష్ తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News