ఆటో డ్రైవర్లు, కంపెనీ కార్మికులకు చౌటుప్పల్ ట్రాఫిక్ పోలీసుల అవగాహన
వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించి, రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని చౌటుప్పల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నందగిరి వెంకటేశం సూచించారు. జిల్లా ఎస్పీ, ట్రాఫిక్ డీఎస్పీల సూచనల మేరకు బుధవారం మండల పరిధిలోని అంకిరెడ్డిగూడెంలో ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఆటో డ్రైవర్లు, వివిధ కంపెనీల కార్మికులకు డ్రైవింగ్ సమయంలో తీసుకోవాల్సిన భద్రతా చర్యల గురించి వివరించారు. వాహనాలు నడిపేటప్పుడు నిర్లక్ష్యం తగదని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. మద్యం తాగి వాహనాలు నడపరాదని, పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లకూడదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పీఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి