రామన్నపేట
రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని రామన్నపేట ఎస్ఐ గోపాతి సతీష్ సూచించారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా రామన్నపేటలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్ఐ గోపాతి సతీష్ మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వాహనాలకు చెల్లుబాటు అయ్యే ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని సూచించారు. ఇన్సూరెన్స్ వల్ల కలిగే ప్రయోజనాలను వాహనదారులకు వివరించారు.
వాహనం నడిపే సమయంలో సెల్ఫోన్ వినియోగం, అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్కు దూరంగా ఉండాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించడంతో పాటు విలువైన ప్రాణాలను కాపాడుకోవచ్చని ఎస్ఐ తెలిపారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి