Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హెల్మెట్‌ ధరించండి.. సురక్షితంగా ఇంటికి చేరండి. రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం ఎస్‌ఐ గోపాతి సతీష్‌. పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 12, 2026 09:12 PM

విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి.. లేదంటే సీఎం పర్యటనలో నిరసన: ఏఐఎస్ఎఫ్

విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి.. లేదంటే సీఎం పర్యటనలో నిరసన: ఏఐఎస్ఎఫ్

విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి.. లేదంటే సీఎం పర్యటనలో నిరసన: ఏఐఎస్ఎఫ్
12-08-2026 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఆగస్టు 15న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంగారెడ్డి జిల్లాకు రానున్న నేపథ్యంలో విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి దత్తు రెడ్డి డిమాండ్ చేశారు. నారాయణఖేడ్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు పెద్ద మొత్తంలో పెండింగ్‌లో ఉన్నప్పటికీ ప్రభుత్వం వాటిని విడుదల చేయడంలో నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. బకాయిలు సకాలంలో అందక కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులపై ఫీజుల కోసం ఒత్తిడి తీసుకువస్తున్నాయని, దీంతో పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఉన్నత విద్యను కొనసాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయడంతో పాటు విద్యాశాఖకు పూర్తిస్థాయి మంత్రి నియమించాలని, ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతులు కల్పించి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించకుండా సీఎం సంగారెడ్డి జిల్లాకు వస్తే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులను సమీకరించి ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన చేపడతామని దత్తు రెడ్డి హెచ్చరించారు. విద్యార్థుల హక్కుల కోసం, ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిల విడుదల కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు ఇసాక్, అభిషేక్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి.. లేదంటే సీఎం పర్యటనలో నిరసన: ఏఐఎస్ఎఫ్

Article Image

ఆగస్టు 15న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంగారెడ్డి జిల్లాకు రానున్న నేపథ్యంలో విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి దత్తు రెడ్డి డిమాండ్ చేశారు. నారాయణఖేడ్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు పెద్ద మొత్తంలో పెండింగ్‌లో ఉన్నప్పటికీ ప్రభుత్వం వాటిని విడుదల చేయడంలో నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. బకాయిలు సకాలంలో అందక కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులపై ఫీజుల కోసం ఒత్తిడి తీసుకువస్తున్నాయని, దీంతో పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఉన్నత విద్యను కొనసాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయడంతో పాటు విద్యాశాఖకు పూర్తిస్థాయి మంత్రి నియమించాలని, ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతులు కల్పించి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించకుండా సీఎం సంగారెడ్డి జిల్లాకు వస్తే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులను సమీకరించి ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన చేపడతామని దత్తు రెడ్డి హెచ్చరించారు. విద్యార్థుల హక్కుల కోసం, ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిల విడుదల కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు ఇసాక్, అభిషేక్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News