Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హెల్మెట్‌ ధరించండి.. సురక్షితంగా ఇంటికి చేరండి. రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం ఎస్‌ఐ గోపాతి సతీష్‌. పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 12, 2026 09:10 PM

మోతెలో జంట హత్యలు

మోతెలో జంట హత్యలు

మోతెలో జంట హత్యలు
12-08-2026 80 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

భార్యాభర్తలను హత్య చేసి పాతిపెట్టిన దుండగులు

సూర్యాపేట జిల్లా మోతె మండల కేంద్ర సమీపంలో భార్యాభర్తల జంట హత్యలు కలకలం సృష్టించాయి. బీక్యా తండాకు చెందిన హలావత్ నాగు, బూబా దంపతులు పొట్టకూటి కోసం మోతెకు వచ్చి భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసుకుంటూ గత రెండేళ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్నారు. రాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు దంపతుల తలపై బలంగా కొట్టి హత్య చేసిన అనంతరం మృతదేహాలను తీసుకొచ్చి భూమిలో పాతిపెట్టినట్లు సంఘటనా స్థలంలో లభించిన ఆనవాళ్లను బట్టి తెలుస్తోందని ఎస్పీ నరసింహ తెలిపారు.

ఉదయం అటుగా వెళ్తున్న రైతులు అనుమానాస్పద పరిస్థితిని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మునగాల సీఐ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పాతిపెట్టిన మృతదేహాలను వెలికితీయగా బీక్యా తండాకు చెందిన నాగు, బూబా దంపతులుగా స్థానికులు గుర్తించినట్లు ఎస్పీ తెలిపారు.

సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్పీ నరసింహ స్వయంగా దర్యాప్తును పర్యవేక్షించారు. హత్యలకు గల కారణాలు, నిందితుల వివరాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Sthanikam

మోతెలో జంట హత్యలు

Article Image

భార్యాభర్తలను హత్య చేసి పాతిపెట్టిన దుండగులు

సూర్యాపేట జిల్లా మోతె మండల కేంద్ర సమీపంలో భార్యాభర్తల జంట హత్యలు కలకలం సృష్టించాయి. బీక్యా తండాకు చెందిన హలావత్ నాగు, బూబా దంపతులు పొట్టకూటి కోసం మోతెకు వచ్చి భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసుకుంటూ గత రెండేళ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్నారు. రాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు దంపతుల తలపై బలంగా కొట్టి హత్య చేసిన అనంతరం మృతదేహాలను తీసుకొచ్చి భూమిలో పాతిపెట్టినట్లు సంఘటనా స్థలంలో లభించిన ఆనవాళ్లను బట్టి తెలుస్తోందని ఎస్పీ నరసింహ తెలిపారు.

ఉదయం అటుగా వెళ్తున్న రైతులు అనుమానాస్పద పరిస్థితిని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మునగాల సీఐ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పాతిపెట్టిన మృతదేహాలను వెలికితీయగా బీక్యా తండాకు చెందిన నాగు, బూబా దంపతులుగా స్థానికులు గుర్తించినట్లు ఎస్పీ తెలిపారు.

సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్పీ నరసింహ స్వయంగా దర్యాప్తును పర్యవేక్షించారు. హత్యలకు గల కారణాలు, నిందితుల వివరాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News