Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ముందస్తు వ్యాక్సినేషన్‌తోనే క్యాన్సర్‌కు చెక్‌ పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 13, 2026 12:19 AM

శిథిలావస్థలో చిన్నకొండూర్ ప్రైమరీ స్కూల్

శిథిలావస్థలో చిన్నకొండూర్ ప్రైమరీ స్కూల్

శిథిలావస్థలో చిన్నకొండూర్ ప్రైమరీ స్కూల్
12-08-2026 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

గంట వర్షానికే కురుస్తున్న భవనం.. భయంలో చిన్నారులు

పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు

తక్షణమే మరమ్మతులు చేపట్టాలని తల్లిదండ్రుల డిమాండ్

చౌటుప్పల్ మండలం చిన్నకొండూర్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనలు వ్యక్తంచేస్తున్నారు. 1 నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులు చదువుతున్న ఈ పాఠశాలలో గంటసేపు వర్షం పడితే చాలు తరగతి గదుల పైకప్పు నుంచి నీరు కారుతోంది. ప్రమాదకర పరిస్థితి ఉన్నప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరూ పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ​పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు లేకపోవడంతో పాటు, సరిపడా తరగతి గదులు లేక బోధన సక్రమంగా సాగడం లేదు. ప్రభుత్వం నుంచి ఒక తరగతి గదికి మాత్రమే నిధులు మంజూరయ్యాయని, అది ఏమాత్రం సరిపోదని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగే వరకు వేచి చూడకుండా, తక్షణమే భవనానికి సమగ్ర మరమ్మతులు చేపట్టి, అదనపు గదులను నిర్మించి, సరిపడా ఉపాధ్యాయులను నియమించాలని విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులను డిమాండ్ చేస్తున్నారు.

Sthanikam

శిథిలావస్థలో చిన్నకొండూర్ ప్రైమరీ స్కూల్

Article Image

గంట వర్షానికే కురుస్తున్న భవనం.. భయంలో చిన్నారులు

పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు

తక్షణమే మరమ్మతులు చేపట్టాలని తల్లిదండ్రుల డిమాండ్

చౌటుప్పల్ మండలం చిన్నకొండూర్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనలు వ్యక్తంచేస్తున్నారు. 1 నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులు చదువుతున్న ఈ పాఠశాలలో గంటసేపు వర్షం పడితే చాలు తరగతి గదుల పైకప్పు నుంచి నీరు కారుతోంది. ప్రమాదకర పరిస్థితి ఉన్నప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరూ పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ​పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు లేకపోవడంతో పాటు, సరిపడా తరగతి గదులు లేక బోధన సక్రమంగా సాగడం లేదు. ప్రభుత్వం నుంచి ఒక తరగతి గదికి మాత్రమే నిధులు మంజూరయ్యాయని, అది ఏమాత్రం సరిపోదని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగే వరకు వేచి చూడకుండా, తక్షణమే భవనానికి సమగ్ర మరమ్మతులు చేపట్టి, అదనపు గదులను నిర్మించి, సరిపడా ఉపాధ్యాయులను నియమించాలని విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులను డిమాండ్ చేస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News