గంట వర్షానికే కురుస్తున్న భవనం.. భయంలో చిన్నారులు
పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు
తక్షణమే మరమ్మతులు చేపట్టాలని తల్లిదండ్రుల డిమాండ్
చౌటుప్పల్ మండలం చిన్నకొండూర్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనలు వ్యక్తంచేస్తున్నారు. 1 నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులు చదువుతున్న ఈ పాఠశాలలో గంటసేపు వర్షం పడితే చాలు తరగతి గదుల పైకప్పు నుంచి నీరు కారుతోంది. ప్రమాదకర పరిస్థితి ఉన్నప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరూ పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు లేకపోవడంతో పాటు, సరిపడా తరగతి గదులు లేక బోధన సక్రమంగా సాగడం లేదు. ప్రభుత్వం నుంచి ఒక తరగతి గదికి మాత్రమే నిధులు మంజూరయ్యాయని, అది ఏమాత్రం సరిపోదని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగే వరకు వేచి చూడకుండా, తక్షణమే భవనానికి సమగ్ర మరమ్మతులు చేపట్టి, అదనపు గదులను నిర్మించి, సరిపడా ఉపాధ్యాయులను నియమించాలని విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులను డిమాండ్ చేస్తున్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి