● వైద్యుల ఉచిత సలహాతో టీకాలు వేయించుకోవాలి
● చౌటుప్పల్ వాసి డీ. శాన్వి పిలుపు
సకాలంలో వైద్యుల సలహాలు పాటిస్తూ తగిన టీకాలు వేయించుకోవడం ద్వారా భవిష్యత్తులో క్యాన్సర్ ముప్పును ముందస్తుగానే నివారించవచ్చని చౌటుప్పల్కు చెందిన డీ. శాన్వి స్పష్టం చేశారు. బుధవారం ఆమె స్థానికంగా మీడియాతో మాట్లాడారు. క్యాన్సర్ బారిన పడకుండా ఉండేందుకు వైద్య నిపుణురాలు డాక్టర్ ప్రశాంతి సలహా మేరకు తాను ‘గార్డాసిల్-9’ (GARDASIL 9) వ్యాక్సిన్ తీసుకున్నానని, తన తమ్ముడు సన్వీర్కు ‘గార్డాసిల్-4’ (GARDASIL 4) వేయించినట్లు తెలిపారు.
క్యాన్సర్ నివారణ వ్యాక్సిన్లపై ప్రతి ఒక్కరూ సరైన అవగాహన పెంపొందించుకోవాలని ఈ సందర్భంగా శాన్వి కోరారు. ఇప్పటివరకు ఈ వ్యాక్సిన్ తీసుకోని వారు తమ వయస్సు, ఆరోగ్య స్థితిని బట్టి అర్హత ఉందో లేదో వైద్యులను కలిసి నిర్ధారించుకోవాలని సూచించారు. అర్హత ఉన్నవారు వెంటనే టీకాలు వేయించుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చని వైద్యురాలు ప్రశాంతి తనకు సూచించినట్లు వెల్లడించారు. ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం అందరూ వ్యాక్సినేషన్పై ముందడుగు వేయాలని డీ. శాన్వి, డీ. సన్వీర్, డాక్టర్ ప్రశాంతి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి