అమావాస్య వేళ.. మల్లన్న గుట్టపై భక్తుల సందడి. చిన్న శ్రీశైలంలో ఘనంగా ప్రత్యేక పూజలు.
అమావాస్య వేళ.. మల్లన్న గుట్టపై భక్తుల సందడి. చిన్న శ్రీశైలంలో ఘనంగా ప్రత్యేక పూజలు.
Editor Desk
కొండ వెంకటేష్–ఉమా దంపతుల ప్రత్యేక పూజలు.
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామంలోని మల్లన్న గుట్టపై కొలువైన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం(చిన్న శ్రీశైలం)లో అమావాస్య సందర్భంగా బుధవారం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు.ఈ అమావాస్య కు కొండ వెంకటేష్–ఉమా దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు.
ప్రదోష వేళ సాయంత్రం 6 గంటలకు మల్లికార్జున స్వామివారి సన్నిధిలో మాస కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు బేతాజీ శశిధర్ దీక్షితుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు కొనసాగాయి. కల్యాణోత్సవం అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు.
ప్రతి అమావాస్య సందర్భంగా స్వామివారి కల్యాణోత్సవంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో మల్లన్న గుట్టకు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. కల్యాణోత్సవాన్ని తిలకించి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అనంతరం పలువురు భక్తులు గుట్టపైనే నిద్ర చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అర్చకులు పేర్కొన్నారు.