Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తిరుమలగిరి పి.ఎస్.సి.ఎస్ చైర్మన్ పదవి ఇవ్వాలి; బైరెడ్డి భాస్కర్ రెడ్డి పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 13, 2026 07:02 PM

అమావాస్య వేళ.. మల్లన్న గుట్టపై భక్తుల సందడి. చిన్న శ్రీశైలంలో ఘనంగా ప్రత్యేక పూజలు.

అమావాస్య వేళ.. మల్లన్న గుట్టపై భక్తుల సందడి. చిన్న శ్రీశైలంలో ఘనంగా ప్రత్యేక పూజలు.

అమావాస్య వేళ.. మల్లన్న గుట్టపై భక్తుల సందడి.  చిన్న శ్రీశైలంలో ఘనంగా ప్రత్యేక పూజలు.
13-08-2026 82 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కొండ వెంకటేష్–ఉమా దంపతుల ప్రత్యేక పూజలు.

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామంలోని మల్లన్న గుట్టపై కొలువైన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం(చిన్న శ్రీశైలం)లో అమావాస్య సందర్భంగా బుధవారం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు.ఈ అమావాస్య కు కొండ వెంకటేష్–ఉమా దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు.

ప్రదోష వేళ సాయంత్రం 6 గంటలకు మల్లికార్జున స్వామివారి సన్నిధిలో మాస కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు బేతాజీ శశిధర్ దీక్షితుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు కొనసాగాయి. కల్యాణోత్సవం అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు.

ప్రతి అమావాస్య సందర్భంగా స్వామివారి కల్యాణోత్సవంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో మల్లన్న గుట్టకు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. కల్యాణోత్సవాన్ని తిలకించి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అనంతరం పలువురు భక్తులు గుట్టపైనే నిద్ర చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అర్చకులు పేర్కొన్నారు.

Sthanikam

అమావాస్య వేళ.. మల్లన్న గుట్టపై భక్తుల సందడి. చిన్న శ్రీశైలంలో ఘనంగా ప్రత్యేక పూజలు.

Article Image

కొండ వెంకటేష్–ఉమా దంపతుల ప్రత్యేక పూజలు.

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామంలోని మల్లన్న గుట్టపై కొలువైన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం(చిన్న శ్రీశైలం)లో అమావాస్య సందర్భంగా బుధవారం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు.ఈ అమావాస్య కు కొండ వెంకటేష్–ఉమా దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు.

ప్రదోష వేళ సాయంత్రం 6 గంటలకు మల్లికార్జున స్వామివారి సన్నిధిలో మాస కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు బేతాజీ శశిధర్ దీక్షితుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు కొనసాగాయి. కల్యాణోత్సవం అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు.

ప్రతి అమావాస్య సందర్భంగా స్వామివారి కల్యాణోత్సవంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో మల్లన్న గుట్టకు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. కల్యాణోత్సవాన్ని తిలకించి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అనంతరం పలువురు భక్తులు గుట్టపైనే నిద్ర చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అర్చకులు పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News