విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట: సర్పంచ్ జువ్వి నర్సింహ్మ
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి, విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ధర్మోజిగూడెం సర్పంచ్ జువ్వి నర్సింహ్మ తెలిపారు. గురువారం ధర్మోజిగూడెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఏపీఎం యాదయ్యతో కలిసి ఆయన ఉచిత ఏకరూప (యూనిఫాం) దుస్తులను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్కారు బడుల్లో నాణ్యమైన విద్యతో పాటు మధ్యాహ్న భోజనం, పుస్తకాలు, యూనిఫారాలు ఉచితంగా అందిస్తున్నామని పేర్కొన్నారు. త్వరలోనే విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందించేందుకు సైతం ప్రభుత్వం చర్యలు చేపడుతోందని, ఈ అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పకీరు శ్రీనివాస్ రెడ్డి, వార్డు సభ్యులు సామిడి సంధ్య, రాచకొండ భార్గవ్, జీడిముడ్ల శోభ, గునుగంటి వెంకటేశం, జంగం వెంకటమ్మ, సిసి మామిళ్ళ నర్సింహ్మ, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గూడురు సునీత, వివోఏ సంతోష, మౌనిక, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి