కుటుంబ సమేతంగా పిక్పాకెటింగ్.. టూ టౌన్ పోలీసులకు చిక్కిన ముగ్గురు.
రద్దీ బస్సులే టార్గెట్.. సెల్ఫోన్లు, నగదే లక్ష్యం | రెండు సెల్ఫోన్లు, ఆటోరిక్షా, రూ.3 వేల నగదు స్వాధీనం
రద్దీగా ఉండే బస్సుల్లో ప్రయాణికుల జేబులు కొట్టి సెల్ఫోన్లు, నగదు అపహరిస్తున్న ముగ్గురిని నల్లగొండ టూ టౌన్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ ముగ్గురిలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు కాగా.. మరొకరు వారిలో ఒకరి భర్త కావడం గమనార్హం. కుటుంబ సమేతంగా పిక్పాకెటింగ్కు పాల్పడుతున్న ఈ ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి రెండు సెల్ఫోన్లు, ఆటోరిక్షా, రూ.3 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. కవిత (A1), నాగమణి (A2), ప్రసాద్ (A3) కలిసి రద్దీగా ఉండే బస్సులను లక్ష్యంగా చేసుకుని పిక్పాకెటింగ్కు పాల్పడుతున్నారు. నిన్న చోరీ చేసిన ప్రాంతానికే మళ్లీ వచ్చి అదే తరహాలో దొంగతనానికి ప్రయత్నించడంతో పోలీసులు వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.పాత కేసులపైనా ఆరా
నిందితులపై ఇప్పటికే పలు జిల్లాల్లో సుమారు 16 పాత కేసులు ఉన్నట్లు టూ టౌన్ సీఐ ఆదిరెడ్డి తెలిపారు. రద్దీ ప్రదేశాల్లో ప్రయాణికుల అప్రమత్తతను ఆసరాగా చేసుకుని వీరు చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
పక్కా సమాచారంతో వల
డీఎస్పీ శివరాం రెడ్డి పర్యవేక్షణలో సీఐ ఆదిరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. టూ టౌన్ ఎస్సైలు డి. సైదాబాబు, మహిళా ఎస్సై మానసతో పాటు కానిస్టేబుళ్లు బాలకోటి, షకీల్ బృందంగా ఏర్పడి నిందితుల కదలికలపై నిఘా పెట్టారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు.ఈ ఆపరేషన్లో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి