ఆత్మీయులు, స్నేహితుల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు
యాదాద్రి భువనగిరి జిల్లా పంచాయతీ సెక్రటరీల సంఘం అధ్యక్షుడు, ఇంద్రపాలనగరం పంచాయతీ కార్యదర్శి వీసం నరేందర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. రామన్నపేట మండల కేంద్రంలోని రహదారి బంగ్లాలో ఆత్మీయులు, స్నేహితుల సమక్షంలో వేడుకలను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు.
ఈ సందర్భంగా వీసం నరేందర్ కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలకు హాజరై శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. పలువురు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో దొడ్డి స్వామి, నాగటి ఉపేందర్, పెరుమాండ్ల యాదగిరి, అప్పం సురేందర్, బాషమల్ల సంతోష్, కర్నె వినయ్, భూతం శ్రీకాంత్, బాధే అశోక్, చంద్రశేఖర్, నాగటి నరేష్ తదితరులు పాల్గొని వీసం నరేందర్కు శుభాకాంక్షలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి