బోనమెత్తి అమ్మవారికి పూజలు నిర్వహించిన మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి..
నల్లగొండ : నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 28వ డివిజన్ పాతబస్తీలో యాదవ సంఘం ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో నగర పాలిక మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని, సంప్రదాయబద్ధంగా బోనం ఎత్తుకొని ఊరేగింపులో సందడి చేశారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక అని కొనియాడారు."బోనం అంటే అమ్మవారికి భక్తిశ్రద్ధలతో సమర్పించే పవిత్ర నైవేద్యం. ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండాలని, నల్లగొండ పట్టణం సర్వతోముఖాభివృద్ధి చెందాలని ఆ జగన్మాతను ప్రార్థించానని తెలిపారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరయ్యారు. వేడుకల్లో పాల్గొన్న వారిలో,మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ గుమ్ముల మోహన్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎడ్ల శ్రీనివాస్ యాదవ్, స్థానిక కార్పొరేటర్ గుండెబోయిన పుష్పలత వెంకన్న, వీరితో పాటు పలువురు డివిజన్ కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, యాదవ సంఘం ప్రతినిధులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఉత్సవాలను విజయవంతం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి