పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు లేవని బాధితుల ఆరోపణ.
అధికారులు స్పందించి న్యాయం చేయాలని వేడుకోలు.
చిట్యాల: తమ భూమిలోకి కొందరు అక్రమంగా ప్రవేశించి, చుట్టూ ఏర్పాటు చేసిన కంచెను తొలగించారని జోగు ప్రవీణ్ ఆరోపించారు. ఈ ఘటనపై గత నెలలో పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు మీడియా మిత్రులకు విడుదల చేసిన ప్రకటనలో వివరాలు వెల్లడించారు.
తమ తాతకు సంబంధించిన భూమికి అన్ని హక్కు పత్రాలు తమ వద్ద ఉన్నాయని, తాము భూమిని సాగు చేసుకుంటున్న సమయంలో గత నెల రాత్రి కొందరు వ్యక్తులు వచ్చి భూమి చుట్టూ ఏర్పాటు చేసిన కంచెను తొలగించారని తెలిపారు. ఘటనపై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పాటు ఎమ్మార్వో, ఆర్డీవో అధికారులకు కూడా ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.
వెంకటస్వామిపై దుర్భాషలను ఖండించిన బాధితులు.
భూ వివాదంలో తమకు న్యాయం చేయాలని ప్రజా పోరాట సమితి నాయకుడు నూనె వెంకటస్వామిని సంప్రదించామని బాధితులు తెలిపారు. తమకు మద్దతుగా వచ్చిన వెంకటస్వామిని కొందరు దుర్భాషలాడడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న వెంకటస్వామిపై చేసిన వ్యాఖ్యలను కూడా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.
భూ వివాదంపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, హక్కు పత్రాలను పరిశీలించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి