Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కుటుంబ సమేతంగా పిక్‌పాకెటింగ్.. టూ టౌన్ పోలీసులకు చిక్కిన ముగ్గురు పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 13, 2026 09:04 PM

భూమిలోకి అక్రమ ప్రవేశం.. కంచె తొలగింపు

భూమిలోకి అక్రమ ప్రవేశం.. కంచె తొలగింపు

భూమిలోకి అక్రమ ప్రవేశం.. కంచె తొలగింపు
13-08-2026 39 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు లేవని బాధితుల ఆరోపణ.


అధికారులు స్పందించి న్యాయం చేయాలని వేడుకోలు.


చిట్యాల: తమ భూమిలోకి కొందరు అక్రమంగా ప్రవేశించి, చుట్టూ ఏర్పాటు చేసిన కంచెను తొలగించారని జోగు ప్రవీణ్ ఆరోపించారు. ఈ ఘటనపై గత నెలలో పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు మీడియా మిత్రులకు విడుదల చేసిన ప్రకటనలో వివరాలు వెల్లడించారు.

తమ తాతకు సంబంధించిన భూమికి అన్ని హక్కు పత్రాలు తమ వద్ద ఉన్నాయని, తాము భూమిని సాగు చేసుకుంటున్న సమయంలో గత నెల రాత్రి కొందరు వ్యక్తులు వచ్చి భూమి చుట్టూ ఏర్పాటు చేసిన కంచెను తొలగించారని తెలిపారు. ఘటనపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పాటు ఎమ్మార్వో, ఆర్డీవో అధికారులకు కూడా ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.


వెంకటస్వామిపై దుర్భాషలను ఖండించిన బాధితులు.


భూ వివాదంలో తమకు న్యాయం చేయాలని ప్రజా పోరాట సమితి నాయకుడు నూనె వెంకటస్వామిని సంప్రదించామని బాధితులు తెలిపారు. తమకు మద్దతుగా వచ్చిన వెంకటస్వామిని కొందరు దుర్భాషలాడడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న వెంకటస్వామిపై చేసిన వ్యాఖ్యలను కూడా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.

భూ వివాదంపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, హక్కు పత్రాలను పరిశీలించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు.

Sthanikam

భూమిలోకి అక్రమ ప్రవేశం.. కంచె తొలగింపు

Article Image

పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు లేవని బాధితుల ఆరోపణ.


అధికారులు స్పందించి న్యాయం చేయాలని వేడుకోలు.


చిట్యాల: తమ భూమిలోకి కొందరు అక్రమంగా ప్రవేశించి, చుట్టూ ఏర్పాటు చేసిన కంచెను తొలగించారని జోగు ప్రవీణ్ ఆరోపించారు. ఈ ఘటనపై గత నెలలో పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు మీడియా మిత్రులకు విడుదల చేసిన ప్రకటనలో వివరాలు వెల్లడించారు.

తమ తాతకు సంబంధించిన భూమికి అన్ని హక్కు పత్రాలు తమ వద్ద ఉన్నాయని, తాము భూమిని సాగు చేసుకుంటున్న సమయంలో గత నెల రాత్రి కొందరు వ్యక్తులు వచ్చి భూమి చుట్టూ ఏర్పాటు చేసిన కంచెను తొలగించారని తెలిపారు. ఘటనపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పాటు ఎమ్మార్వో, ఆర్డీవో అధికారులకు కూడా ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.


వెంకటస్వామిపై దుర్భాషలను ఖండించిన బాధితులు.


భూ వివాదంలో తమకు న్యాయం చేయాలని ప్రజా పోరాట సమితి నాయకుడు నూనె వెంకటస్వామిని సంప్రదించామని బాధితులు తెలిపారు. తమకు మద్దతుగా వచ్చిన వెంకటస్వామిని కొందరు దుర్భాషలాడడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న వెంకటస్వామిపై చేసిన వ్యాఖ్యలను కూడా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.

భూ వివాదంపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, హక్కు పత్రాలను పరిశీలించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News