పంతంగిలో ఘనంగా శ్రావణమాస కుమ్మరుల తొలిబోనం జాతర
అమ్మవారికి మట్టికుండలోనే నైవేద్యం సమర్పించడం ఎంతో ప్రీతికరమని కుమ్మరి సంఘం మండల అధ్యక్షుడు సిలివేరు శ్రీనివాస్ అన్నారు. చౌటుప్పల్ మండల పరిధిలోని పంతంగి గ్రామంలో శ్రావణమాసం సందర్భంగా కుమ్మరుల తొలి బోనం జాతర కార్యక్రమాన్ని గ్రామ అధ్యక్షుడు వట్టిపల్లి జంగయ్య ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిలివేరు శ్రీనివాస్-ధనలక్ష్మి దంపతులు, మండల ప్రధాన కార్యదర్శి పోలేపల్లి ముత్తయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. శ్రావణమాస బోనాల మహోత్సవాల్లో ప్రతి ఒక్కరూ మట్టికుండలనే వినియోగించాలని కోరారు. బంగారు, వెండి పాత్రల్లో నైవేద్యం సమర్పించడం సరికాదని, మట్టికుండల వినియోగం వల్ల ఆరోగ్యంతో పాటు పర్యావరణ పరిరక్షణకూ తోడ్పడుతుందని తెలిపారు. గ్రామంలో తొలిబోనం జాతరను పెద్ద ఎత్తున నిర్వహించడం అభినందనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు రాధారపు భగవంత్, ప్రధాన కార్యదర్శి వట్టిపల్లి భాస్కర్, కుల పెద్దలు ఇస్తారి, సుక్కయ్య, మల్లేష్, శ్రీనివాస్, వెంకటయ్య, లింగస్వామి, సురేష్, సోమయ్య, ధనంజయ్, విజయ్, మల్కాపురం గ్రామానికి చెందిన మల్లేష్, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి