తెలుగు పచ్చళ్ల కంపెనీలో అవగాహన సదస్సు
మహిళలు, చిన్నారుల భద్రతను రక్షించడంలో సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (సీఐ) జి. మన్మధ కుమార్ పిలుపునిచ్చారు. మల్కాపురం ఐటీ పార్క్లోని 'తెలుగు పచ్చళ్ళు' కంపెనీ ప్రాంగణంలో గురువారం 'ఉమెన్ సేఫ్టీ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ' అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా సీఐ మన్మధ కుమార్ మాట్లాడుతూ... మహిళలు, చిన్నారులు ఎదుర్కొనే వివిధ రకాల వేధింపులు, అత్యవసర సమయాల్లో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. ఆపదలో ఉన్నప్పుడు భయపడకుండా వెంటనే పోలీసులను సంప్రదించాలని, బాధితులకు అండగా ఉండేందుకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని భరోసానిచ్చారు.
కార్యక్రమంలో సీడీఈడబ్ల్యూ (CDEW) కమిటీ సభ్యులు, పోలీస్ సిబ్బంది, కంపెనీ నిర్వాహకులు, ఉద్యోగులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి