Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యార్థులకు షూల పంపిణీ.. దాతృత్వం చాటుకున్న బోరం ప్రకాశ్‌రెడ్డి పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 13, 2026 06:06 PM

.తుంగతుర్తిలో సివిల్ కోర్టు ఏర్పాటుకు స్థల పరిశీలన

.తుంగతుర్తిలో సివిల్ కోర్టు ఏర్పాటుకు స్థల పరిశీలన

.తుంగతుర్తిలో సివిల్ కోర్టు ఏర్పాటుకు స్థల పరిశీలన
13-08-2026 3 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar


తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో రూ.29 కోట్ల వ్యయంతో మంజూరైన సివిల్ కోర్టు నిర్మాణానికి స్థల పరిశీలన చేపట్టారు. బుధవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని జాతీయ రహదారి 365 పక్కన కోర్టు భవన నిర్మాణానికి అనువైన స్థలాన్ని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు పరిశీలించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మందుల సామేలు మాట్లాడుతూ తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలకు న్యాయ సేవలు మరింత అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో సివిల్ కోర్టు మంజూరు చేయించుకున్నామని తెలిపారు. రూ.29 కోట్లతో నిర్మించనున్న కోర్టు భవనానికి స్థల పరిశీలన పూర్తయిందని, అవసరమైన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి అతి త్వరలో శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వెల్లడించారు.తుంగతుర్తి కేంద్రంలో సివిల్ కోర్టు ఏర్పాటుతో నియోజకవర్గ ప్రజలకు న్యాయపరమైన సేవలు సులభంగా అందుబాటులోకి వస్తాయని, న్యాయం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ఇబ్బందులు తగ్గుతాయని పేర్కొన్నారు. కోర్టు భవన నిర్మాణం పూర్తయితే తుంగతుర్తి అభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడుతుందని ఎమ్మెల్యే తెలిపారు.

Sthanikam

.తుంగతుర్తిలో సివిల్ కోర్టు ఏర్పాటుకు స్థల పరిశీలన

Article Image


తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో రూ.29 కోట్ల వ్యయంతో మంజూరైన సివిల్ కోర్టు నిర్మాణానికి స్థల పరిశీలన చేపట్టారు. బుధవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని జాతీయ రహదారి 365 పక్కన కోర్టు భవన నిర్మాణానికి అనువైన స్థలాన్ని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు పరిశీలించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మందుల సామేలు మాట్లాడుతూ తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలకు న్యాయ సేవలు మరింత అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో సివిల్ కోర్టు మంజూరు చేయించుకున్నామని తెలిపారు. రూ.29 కోట్లతో నిర్మించనున్న కోర్టు భవనానికి స్థల పరిశీలన పూర్తయిందని, అవసరమైన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి అతి త్వరలో శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వెల్లడించారు.తుంగతుర్తి కేంద్రంలో సివిల్ కోర్టు ఏర్పాటుతో నియోజకవర్గ ప్రజలకు న్యాయపరమైన సేవలు సులభంగా అందుబాటులోకి వస్తాయని, న్యాయం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ఇబ్బందులు తగ్గుతాయని పేర్కొన్నారు. కోర్టు భవన నిర్మాణం పూర్తయితే తుంగతుర్తి అభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడుతుందని ఎమ్మెల్యే తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News