Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యార్థులకు షూల పంపిణీ.. దాతృత్వం చాటుకున్న బోరం ప్రకాశ్‌రెడ్డి పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 13, 2026 06:57 PM

విద్యార్థులకు షూల పంపిణీ.. దాతృత్వం చాటుకున్న బోరం ప్రకాశ్‌రెడ్డి

విద్యార్థులకు షూల పంపిణీ.. దాతృత్వం చాటుకున్న బోరం ప్రకాశ్‌రెడ్డి

విద్యార్థులకు షూల పంపిణీ.. దాతృత్వం చాటుకున్న బోరం ప్రకాశ్‌రెడ్డి
13-08-2026 14 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

నేటి చిన్నారులే రేపటి భావి భారత పౌరులని, క్రమశిక్షణతో కష్టపడి చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని మందోల్లగూడెం మాజీ ఉపసర్పంచ్, బీఆర్ఎస్ నాయకులు బోరం ప్రకాశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం మండల పరిధిలోని తూర్పుగూడెం ప్రాథమిక పాఠశాలలో 25 మంది, మందోల్లగూడెం ప్రాథమిక పాఠశాలలో 11 మంది విద్యార్థులకు ఆయన సొంత ఖర్చులతో షూలను ఉచితంగా అందజేశారు. ​ఈ సందర్భంగా ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులను చదువులో ప్రోత్సహించేందుకు ఉపాధ్యాయులు మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు. పాఠశాలల అభివృద్ధికి, విద్యార్థుల సంక్షేమానికి తనవంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని హామీ ఇచ్చారు.​కార్యక్రమంలో తూర్పుగూడెం ప్రాథమిక పాఠశాల ఏఏపీసీ చైర్మన్ పిట్టల సంతోష్, 7వ వార్డు సభ్యుడు మానే రవికుమార్, 8వ వార్డు సభ్యుడు గుండు శ్రీశైలం, తూర్పుగూడెం ప్రధానోపాధ్యాయులు ఎస్. పరమేష్, ఉపాధ్యాయురాలు జి. వరలక్ష్మి, మందోల్లగూడెం ప్రధానోపాధ్యాయురాలు ఎన్. సంధ్య, గ్రామానికి చెందిన యువకులు గుండు ప్రశాంత్, నిలిగొండ రఘు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

విద్యార్థులకు షూల పంపిణీ.. దాతృత్వం చాటుకున్న బోరం ప్రకాశ్‌రెడ్డి

Article Image

నేటి చిన్నారులే రేపటి భావి భారత పౌరులని, క్రమశిక్షణతో కష్టపడి చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని మందోల్లగూడెం మాజీ ఉపసర్పంచ్, బీఆర్ఎస్ నాయకులు బోరం ప్రకాశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం మండల పరిధిలోని తూర్పుగూడెం ప్రాథమిక పాఠశాలలో 25 మంది, మందోల్లగూడెం ప్రాథమిక పాఠశాలలో 11 మంది విద్యార్థులకు ఆయన సొంత ఖర్చులతో షూలను ఉచితంగా అందజేశారు. ​ఈ సందర్భంగా ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులను చదువులో ప్రోత్సహించేందుకు ఉపాధ్యాయులు మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు. పాఠశాలల అభివృద్ధికి, విద్యార్థుల సంక్షేమానికి తనవంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని హామీ ఇచ్చారు.​కార్యక్రమంలో తూర్పుగూడెం ప్రాథమిక పాఠశాల ఏఏపీసీ చైర్మన్ పిట్టల సంతోష్, 7వ వార్డు సభ్యుడు మానే రవికుమార్, 8వ వార్డు సభ్యుడు గుండు శ్రీశైలం, తూర్పుగూడెం ప్రధానోపాధ్యాయులు ఎస్. పరమేష్, ఉపాధ్యాయురాలు జి. వరలక్ష్మి, మందోల్లగూడెం ప్రధానోపాధ్యాయురాలు ఎన్. సంధ్య, గ్రామానికి చెందిన యువకులు గుండు ప్రశాంత్, నిలిగొండ రఘు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News