నకిరేకల్:
నిర్మల్ జిల్లా కేంద్రంలో ఈనెల 15న నిర్వహించనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించనున్నారు. అనంతరం జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రసంగించనున్నారు. వేడుకలకు ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి