Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యార్థులకు షూల పంపిణీ.. దాతృత్వం చాటుకున్న బోరం ప్రకాశ్‌రెడ్డి పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 13, 2026 06:55 PM

ఎస్సీ, ఎస్టీల పథకాలు పకడ్బందీగా అమలు చేయాలి. నిధులు దారి మళ్లిస్తే కఠిన చర్యలు

ఎస్సీ, ఎస్టీల పథకాలు పకడ్బందీగా అమలు చేయాలి. నిధులు దారి మళ్లిస్తే కఠిన చర్యలు

ఎస్సీ, ఎస్టీల పథకాలు పకడ్బందీగా అమలు చేయాలి.  నిధులు దారి మళ్లిస్తే కఠిన చర్యలు
13-08-2026 12 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ, ఆగస్టు 12 (స్థానికం ప్రతినిధి): షెడ్యూల్డ్‌ కులాలు, తెగల అభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్య అధికారులను ఆదేశించారు. బుధవారం నల్గొండ జిల్లా కలెక్టరేట్‌లోని ఉదయాదిత్య భవన్‌లో కమిషన్‌ సభ్యులతో కలిసి ఎస్సీ, ఎస్టీల భూముల సమస్యలు, దాడుల కేసులు, ఉద్యోగాలు, ప్రమోషన్లలో రిజర్వేషన్ల అమలుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఎస్సీల కోసం వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న సబ్‌ప్లాన్‌ నిధులను పూర్తిగా వారికే వినియోగించాలని, నిధులను దారి మళ్లిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీ ఆవాసాల్లో మంజూరైన పనులను ఇతర ప్రాంతాలకు మళ్లించవద్దని సూచించారు. మిగిలిన నిధులతో ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీలు, ఇతర మౌలిక వసతులు కల్పించాలని తెలిపారు.

ఉద్యోగ నియామకాలు, ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్‌ తప్పనిసరిగా అమలు చేయాలని స్పష్టం చేశారు. ఎంపీ, నియోజకవర్గ అభివృద్ధి, ఎస్‌డీఎఫ్‌ నిధులను కూడా నిబంధనల ప్రకారం కేటాయించాలని సూచించారు.

ఎస్సీ, ఎస్టీలపై దాడులకు సంబంధించిన కేసులను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. మిర్యాలగూడ డివిజన్‌లోని శూన్యపహాడ్‌–గణేష్‌పహాడ్‌ రోడ్డు సమస్యను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్‌ను కోరారు. మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు తప్పనిసరిగా ఇన్సూరెన్స్‌ కల్పించాలని సూచించారు.

మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల నియామకంపై తక్షణమే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ను ఆదేశించారు. చండూరు మండలం అంగడిపేటకు చెందిన ఎస్సీ మహిళ మేకల బుచ్చమ్మ ఇంటి వివాదాన్ని విచారించి పరిష్కరించాలని సూచించారు.

బాధితులకు రూ.1.89 కోట్ల పరిహారం

అనంతరం మీడియాతో బక్కి వెంకటయ్య మాట్లాడుతూ.. జిల్లాలో ఎస్సీ, ఎస్టీలపై దాడుల కేసుల్లో బాధితులకు అందాల్సిన రూ.1.89 కోట్ల పరిహారం త్వరగా అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కులాంతర వివాహాలు చేసుకున్న వారికి, బెస్ట్‌ అవైలబుల్‌ పాఠశాలలకు నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి నేతృత్వంలో జరగనున్న హైపవర్‌ కమిటీ సమావేశంలో కోరనున్నట్లు చెప్పారు.

గుడితాండ పునరావాస కేంద్రానికి సంబంధించి 130 మందికి పరిహారం అందని అంశంపై సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. నల్గొండ బైపాస్‌ వద్ద ఉన్న అంబేద్కర్‌, బాబు జగ్జీవన్‌రామ్‌ విగ్రహాలను తొలగించకుండా కమిటీ వేసి విచారణ చేపట్టాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీల కేసుల్లో ఉచిత న్యాయ సహాయం అందిస్తున్న అడ్వకేట్‌ దర్శన్‌కు గన్‌మెన్‌ రక్షణ పునరుద్ధరించాలని ఎస్పీని కోరారు.

జిల్లా కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలపై దాడుల కేసుల్లో చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామని తెలిపారు. జిల్లా విజిలెన్స్‌ మానిటరింగ్‌ కమిటీని ఏర్పాటు చేసి ఇప్పటికే రెండుసార్లు సమావేశాలు నిర్వహించామని చెప్పారు. ప్రతి నెల పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని, అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్‌ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి ఏడాది 90 నుంచి 100 వరకు ఎస్సీ, ఎస్టీలపై దాడుల కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం 54 కేసులు విచారణలో ఉండగా, ఇప్పటివరకు ఆరు కేసుల్లో కోర్టుల ద్వారా శిక్షలు పడినట్లు వెల్లడించారు.

కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ సభ్యులు కే.లక్ష్మీనారాయణ, శంకర్‌, రాంబాబు నాయక్‌ తదితరులతో పాటు కలెక్టర్‌ జె.శ్రీనివాస్‌, అదనపు కలెక్టర్‌ ప్రేమకరణ్‌రెడ్డి, శిక్షణ సహాయ కలెక్టర్‌ శ్రీకాంత్‌రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ శశికళ, డీటీడీవో కమలాకర్‌, డీఎఫ్‌ఓ రాజశేఖర్‌, డీఆర్వో దశరథ్‌, ఆర్డీవోలు, డీఎస్పీలు, జిల్లా విజిలెన్స్‌ మానిటరింగ్‌ కమిటీ సభ్యులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Sthanikam

ఎస్సీ, ఎస్టీల పథకాలు పకడ్బందీగా అమలు చేయాలి. నిధులు దారి మళ్లిస్తే కఠిన చర్యలు

Article Image

నల్గొండ, ఆగస్టు 12 (స్థానికం ప్రతినిధి): షెడ్యూల్డ్‌ కులాలు, తెగల అభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్య అధికారులను ఆదేశించారు. బుధవారం నల్గొండ జిల్లా కలెక్టరేట్‌లోని ఉదయాదిత్య భవన్‌లో కమిషన్‌ సభ్యులతో కలిసి ఎస్సీ, ఎస్టీల భూముల సమస్యలు, దాడుల కేసులు, ఉద్యోగాలు, ప్రమోషన్లలో రిజర్వేషన్ల అమలుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఎస్సీల కోసం వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న సబ్‌ప్లాన్‌ నిధులను పూర్తిగా వారికే వినియోగించాలని, నిధులను దారి మళ్లిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీ ఆవాసాల్లో మంజూరైన పనులను ఇతర ప్రాంతాలకు మళ్లించవద్దని సూచించారు. మిగిలిన నిధులతో ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీలు, ఇతర మౌలిక వసతులు కల్పించాలని తెలిపారు.

ఉద్యోగ నియామకాలు, ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్‌ తప్పనిసరిగా అమలు చేయాలని స్పష్టం చేశారు. ఎంపీ, నియోజకవర్గ అభివృద్ధి, ఎస్‌డీఎఫ్‌ నిధులను కూడా నిబంధనల ప్రకారం కేటాయించాలని సూచించారు.

ఎస్సీ, ఎస్టీలపై దాడులకు సంబంధించిన కేసులను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. మిర్యాలగూడ డివిజన్‌లోని శూన్యపహాడ్‌–గణేష్‌పహాడ్‌ రోడ్డు సమస్యను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్‌ను కోరారు. మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు తప్పనిసరిగా ఇన్సూరెన్స్‌ కల్పించాలని సూచించారు.

మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల నియామకంపై తక్షణమే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ను ఆదేశించారు. చండూరు మండలం అంగడిపేటకు చెందిన ఎస్సీ మహిళ మేకల బుచ్చమ్మ ఇంటి వివాదాన్ని విచారించి పరిష్కరించాలని సూచించారు.

బాధితులకు రూ.1.89 కోట్ల పరిహారం

అనంతరం మీడియాతో బక్కి వెంకటయ్య మాట్లాడుతూ.. జిల్లాలో ఎస్సీ, ఎస్టీలపై దాడుల కేసుల్లో బాధితులకు అందాల్సిన రూ.1.89 కోట్ల పరిహారం త్వరగా అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కులాంతర వివాహాలు చేసుకున్న వారికి, బెస్ట్‌ అవైలబుల్‌ పాఠశాలలకు నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి నేతృత్వంలో జరగనున్న హైపవర్‌ కమిటీ సమావేశంలో కోరనున్నట్లు చెప్పారు.

గుడితాండ పునరావాస కేంద్రానికి సంబంధించి 130 మందికి పరిహారం అందని అంశంపై సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. నల్గొండ బైపాస్‌ వద్ద ఉన్న అంబేద్కర్‌, బాబు జగ్జీవన్‌రామ్‌ విగ్రహాలను తొలగించకుండా కమిటీ వేసి విచారణ చేపట్టాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీల కేసుల్లో ఉచిత న్యాయ సహాయం అందిస్తున్న అడ్వకేట్‌ దర్శన్‌కు గన్‌మెన్‌ రక్షణ పునరుద్ధరించాలని ఎస్పీని కోరారు.

జిల్లా కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలపై దాడుల కేసుల్లో చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామని తెలిపారు. జిల్లా విజిలెన్స్‌ మానిటరింగ్‌ కమిటీని ఏర్పాటు చేసి ఇప్పటికే రెండుసార్లు సమావేశాలు నిర్వహించామని చెప్పారు. ప్రతి నెల పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని, అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్‌ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి ఏడాది 90 నుంచి 100 వరకు ఎస్సీ, ఎస్టీలపై దాడుల కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం 54 కేసులు విచారణలో ఉండగా, ఇప్పటివరకు ఆరు కేసుల్లో కోర్టుల ద్వారా శిక్షలు పడినట్లు వెల్లడించారు.

కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ సభ్యులు కే.లక్ష్మీనారాయణ, శంకర్‌, రాంబాబు నాయక్‌ తదితరులతో పాటు కలెక్టర్‌ జె.శ్రీనివాస్‌, అదనపు కలెక్టర్‌ ప్రేమకరణ్‌రెడ్డి, శిక్షణ సహాయ కలెక్టర్‌ శ్రీకాంత్‌రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ శశికళ, డీటీడీవో కమలాకర్‌, డీఎఫ్‌ఓ రాజశేఖర్‌, డీఆర్వో దశరథ్‌, ఆర్డీవోలు, డీఎస్పీలు, జిల్లా విజిలెన్స్‌ మానిటరింగ్‌ కమిటీ సభ్యులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News