చిట్యాల: చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని శివనేనిగూడెం గ్రామానికి చెందిన రుద్రవరం సునీల్ పీహెచ్డీ డాక్టరేట్ పట్టా అందుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలోని డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ వర్క్లో సామాజిక అంశంపై పరిశోధన పూర్తి చేసినందుకు ఆయనకు డాక్టరేట్ ప్రదానం చేసినట్లు యూనివర్సిటీ ప్రెస్నోట్లో పేర్కొంది.
ప్రొఫెసర్ ఎస్.ఎఫ్. చంద్రశేఖర్ సూపర్వైజర్గా, ప్రొఫెసర్ చింత గణేష్ జాయింట్ సూపర్వైజర్గా వ్యవహరించిన ఈ పరిశోధనలో “ఇంపాక్ట్ ఆఫ్ పావర్టీ ఎలివేషన్ ప్రోగ్రామ్స్ ఆన్ షెడ్యూల్డ్ క్యాస్ట్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ) ఇన్ నల్గొండ డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ స్టేట్” అనే అంశాన్ని సునీల్ అధ్యయనం చేశారు.
డాక్టరేట్ సాధించిన సందర్భంగా ప్రొఫెసర్లు, పరిశోధక విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు సునీల్ను అభినందించారు. తన డాక్టరేట్ను తల్లిదండ్రులు చంద్రయ్య, యాదమ్మకు అంకితం చేస్తున్నట్లు సునీల్ తెలిపారు. తన పరిశోధనకు సహకరించిన ప్రొఫెసర్లు, తోటి పరిశోధక విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఆరు కిలోమీటర్లు నడిచి పాఠశాలకు..
తన చిన్ననాటి అనుభవాలను గుర్తుచేసుకున్న సునీల్.. శివనేనిగూడెం నుంచి చిట్యాల ప్రభుత్వ పాఠశాలకు వెళ్లేందుకు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం కలిపి సుమారు ఆరు కిలోమీటర్లు నడిచేవాడినని తెలిపారు. ఒకవైపు విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొంటూనే మరోవైపు చదువును నిర్లక్ష్యం చేయకుండా లక్ష్యం వైపు ముందుకు సాగానన్నారు.
జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా లక్ష్యాన్ని సాధించే వరకు వెనుకడుగు వేయొద్దని, ప్రస్తుత విద్యార్థులు పట్టుదలతో ముందుకు సాగాలని సునీల్ సూచించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి