రామన్నపేట, ఆగస్టు 13: రామన్నపేట మండలం మునిపంపుల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు ఉండ్రాతి వెంకన్న దశదిన కార్యక్రమంలో పాల్గొని ఆయన స్థూపం వద్ద ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వెంకన్న స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు, అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ మాజీ అధ్యక్షుడు మామిళ్ల అశోక్, ఉపసర్పంచ్ తాళ్ల క్రాంతికుమార్, నాయకులు మామిడి పాండురెడ్డి, మాజీ ఎంపీటీసీ గాదె పారిజాత ముకుంద, వార్డు సభ్యులు కోనూరు లక్ష్మమ్మ, మేకల రాములు, మామిండ్ల కుమారస్వామి, తాళ్ల వెంకటేశం, గంగాధర గోపాల్, కాయ యాదయ్య, గంగాధరి శ్రీను, అయ్యాడపు అంజిరెడ్డి, ఉండ్రాతి మహేష్, మచ్చ గిరి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి