సూర్యాపేట: మహిళలను గౌరవించాలని సూచించే బోర్డులు ఇంతకాలం బస్టాండ్లలో కనిపించేవి. అయితే సూర్యాపేట కొత్త బస్టాండ్లో ఆర్టీసీ ఏర్పాటు చేసిన ఓ సరికొత్త బోర్డు ఇప్పుడు ప్రయాణికుల దృష్టిని ఆకర్షిస్తోంది.
“పురుషులను గౌరవించడం మన సంప్రదాయం”
“పురుషులను గౌరవించడం మన సంప్రదాయం.. వారికి కేటాయించిన సీట్లలో కూర్చోబెట్టండి” అంటూ ఏర్పాటు చేసిన ఈ బోర్డు చూసి ప్రయాణికులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. మహిళలకు ప్రత్యేక గౌరవం, సౌకర్యాలపై సందేశాలు కనిపించే రోజుల్లో.. పురుషుల కోసం కూడా ఇలాంటి సందేశం దర్శనమివ్వడం ఆసక్తికరంగా మారింది.
బస్టాండ్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్!
బోర్డును చూసిన పలువురు ప్రయాణికులు “ట్రెండ్ మారింది గురూ.. మగాళ్లకూ మంచి రోజులొచ్చాయ్!” అంటూ సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం ఈ బోర్డు సూర్యాపేట కొత్త బస్టాండ్లో ప్రయాణికులను ఆకట్టుకుంటూ.. సోషల్ మీడియాలోనూ చర్చకు దారితీస్తోంది.
మీ అభిప్రాయం ఏంటి..?
పురుషులకు కూడా ప్రత్యేక గౌరవం, సీట్ల కేటాయింపు అవసరమేనా...?

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి