ఎంపీడీవో కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీల స్వీకరణ.
చిట్యాల: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నెల 17వ తేదీ సోమవారం నుంచి మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు చిట్యాల పురపాలక సంఘం కమిషనర్ తెలిపారు. మండల ప్రజల సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమాన్ని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అర్జీలు, వినతిపత్రాలను ప్రజావాణి కార్యక్రమంలో సమర్పించి పరిష్కారం పొందాలని అధికారులు సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా మండల స్థాయిలోనే ప్రజావాణి నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి