హైదరాబాద్:
సరూర్నగర్లోని భగత్సింగ్నగర్లో పోలీసులు భారీ స్థాయిలో కమ్యూనిటీ కనెక్ట్ కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించారు. సీపీ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ తనిఖీల్లో 428 ఇళ్లను తనిఖీ చేసి వివరాలను నమోదు చేయగా.. 369 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
494 వాహనాల తనిఖీ.. 33 వాహనాలు డిటెయిన్
తనిఖీల్లో భాగంగా మొత్తం 494 వాహనాలను పరిశీలించారు. ఇందులో 436 ద్విచక్ర వాహనాలు, 28 త్రిచక్ర వాహనాలు, 30 నాలుగు చక్రాల వాహనాలు ఉన్నాయి. సరైన పత్రాలు లేని 33 వాహనాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల ద్వారా రూ.85,282 వసూలు చేశారు.
మద్యం, గుట్కా స్వాధీనం.
కార్డన్ సెర్చ్లో సుమారు రూ.20,500 విలువైన 18.72 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. అలాగే నిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తులు సుమారు రూ.14,300 విలువైనవి సీజ్ చేశారు.
ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక డ్రైవ్
కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీసులు సైతం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. 221 వాహనాలను తనిఖీ చేసి.. 120 ద్విచక్ర వాహనాలు, 101 నాలుగు చక్రాల వాహనాలపై చర్యలు చేపట్టారు. ఈ తనిఖీల ద్వారా మొత్తం రూ.76,735 జరిమానా వసూలు చేశారు.
అధికారుల పర్యవేక్షణలో తనిఖీలు
డీసీపీ ఎల్బీనగర్, అదనపు డీసీపీ ఎల్బీనగర్, ఏసీపీ ఎల్బీనగర్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. ఎల్బీనగర్ జోన్ పోలీసు బలగాలతో పాటు SOT, ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు.
ప్రజా భద్రతే లక్ష్యం.
ప్రాంతంలో పోలీసుల ఉనికిని మరింత పెంచడం, ప్రజలతో నేరుగా సంబంధాలు బలోపేతం చేయడం, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడం, నేరస్తులను గుర్తించడం, ప్రజలకు భద్రత కల్పించడమే ఈ కమ్యూనిటీ కనెక్ట్ కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పోలీసులు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి