హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఉద్యమకారుల సేవలను గుర్తిస్తూ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. శుక్రవారం ఎల్బీనగర్లో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం చైర్మన్ కాచం సత్యనారాయణ, ఎల్బీనగర్ ఇన్చార్జి బీరెల్లి వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో ఉద్యమకారులకు ప్రశంస పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కంఠం సైదులుకు ప్రశంస పత్రాన్ని అందజేసి సత్కరించారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులు చేసిన పోరాటాలు, త్యాగాలు, ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో వారి పాత్రను కాచం సత్యనారాయణ కొనియాడారు. ఉద్యమం కోసం అహర్నిశలు శ్రమించిన వారిని గుర్తించి గౌరవించడం సమాజ బాధ్యత అన్నారు.
ఉద్యమ చరిత్రను భావితరాలకు చాటాలి
ఎల్బీనగర్, మహేశ్వరం నియోజకవర్గాలకు చెందిన పలువురు ఉద్యమకారులకు కూడా ప్రశంస పత్రాలు అందజేశారు. నర చంద్రశేఖర్రెడ్డి, ఈ. అశోక్కుమార్, కడిమల గోపాల్, బొమ్మకంటి శ్రీనివాస్, చింతపట్ల రవీందర్, అనంతకుమార్, అశోక్కుమార్ తదితరులను సత్కరించారు.
తెలంగాణ కోసం సాగిన ఉద్యమ పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందని, ఉద్యమకారుల త్యాగాలను భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని కాచం సత్యనారాయణ, బీరెల్లి వెంకట్రెడ్డి అన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి