యువత మద్యం, గంజాయి, డ్రగ్స్ వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ తమ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని డీవైఎఫ్ఐ మండల అధ్యక్షుడు శానగొండ రాము పిలుపునిచ్చారు. కొమ్మాయిగూడెం గ్రామంలో నిర్వహించిన డీవైఎఫ్ఐ సమావేశంలో ఆయన మాట్లాడారు.
నేటి సమాజంలో మద్యం, గంజాయి, డ్రగ్స్ వంటి వ్యసనాలు యువతపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ విద్య, ఉపాధి, క్రీడలు, నైపుణ్యాభివృద్ధి, సామాజిక సేవల వైపు అడుగులు వేయాలని సూచించారు.
యువత ఎదుర్కొంటున్న ఉపాధి, విద్య, క్రీడలు, నైపుణ్యాభివృద్ధి తదితర సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా ఉద్యమించాలని కోరారు. యువతకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు క్రీడా మైదానాలు, యువజన కేంద్రాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.
యువతే దేశ భవిష్యత్తు
యువతే దేశ భవిష్యత్తు అని, సమాజ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని శానగొండ రాము అన్నారు. యువజన సమస్యల పరిష్కారం కోసం డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో మరిన్ని ఉద్యమాలు చేపడతామని తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి