ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారి వెంకటలక్ష్మి, నూతన చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన బొబ్బిళ్ళ మురళి గురుస్వామి తో పాటు పాలకమండలి ధర్మకర్తలచే ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం చేసిన నూతన ధర్మకర్తలు వర్కల రవి గౌడ్, ఆవుల యేసు యాదవ్, దాడి యశ్వంత్ రెడ్డి, గగులోతు అరుణ నాయక్ లు ఉన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, మార్కెట్ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, పబ్బు రాజు గౌడ్, వెన్ రెడ్డి రాజు, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు కాసర్ల శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్షుడు బోయ దేవేందర్, స్థానిక కౌన్సిలర్ పిల్లలమర్రి మధుసూదన్, మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, వ్యాపారస్తులు, భక్తులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన పాలకమండలికి శుభాకాంక్షలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి