రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం గ్రామపంచాయతీ పరిధిలో పారిశుధ్య నిర్వహణలో కీలకంగా పనిచేస్తున్న సిబ్బందికి నూతన దుస్తులు, గ్లౌజులు, మాస్కులు తదితర సానిటరీ సామగ్రిని పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ గర్దాసు విక్రమ్ మాట్లాడుతూ.. గ్రామాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా ఉంచడంలో పారిశుధ్య సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. సిబ్బంది విధులు నిర్వహించే సమయంలో రక్షణ, పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ అవసరమైన సామగ్రిని అందజేసినట్లు తెలిపారు.
గ్రామంలో పారిశుధ్య కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తూ ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని సిబ్బందికి సూచించారు. గ్రామ పరిశుభ్రతకు ప్రజలు కూడా సహకరించాలని కోరారు.
కార్యక్రమంలో ఉపసర్పంచ్ జయసుధ స్వామి, పంచాయతీ కార్యదర్శి వీసం నరేందర్, వార్డు సభ్యులు కంబాలపల్లి సత్తయ్య, రాధారపు మహేశ్, వరికుప్పల స్వామి, నాగలక్ష్మిరాజు, కప్పల మంగమ్మ రాజు, పుట్టల లక్ష్మమ్మ ముత్యాలు, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి