Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అంకిరెడ్డిగూడెంలో డంపింగ్ యార్డ్‌ నిర్మించవద్దు పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 14, 2026 07:01 PM

పారిశుధ్య సిబ్బందికి నూతన దుస్తులు పంపిణీ. సర్పంచ్ గర్దాసు విక్రమ్

పారిశుధ్య సిబ్బందికి నూతన దుస్తులు పంపిణీ. సర్పంచ్ గర్దాసు విక్రమ్

పారిశుధ్య సిబ్బందికి నూతన దుస్తులు పంపిణీ.   సర్పంచ్ గర్దాసు విక్రమ్
14-08-2026 12 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం గ్రామపంచాయతీ పరిధిలో పారిశుధ్య నిర్వహణలో కీలకంగా పనిచేస్తున్న సిబ్బందికి నూతన దుస్తులు, గ్లౌజులు, మాస్కులు తదితర సానిటరీ సామగ్రిని పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ గర్దాసు విక్రమ్ మాట్లాడుతూ.. గ్రామాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా ఉంచడంలో పారిశుధ్య సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. సిబ్బంది విధులు నిర్వహించే సమయంలో రక్షణ, పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ అవసరమైన సామగ్రిని అందజేసినట్లు తెలిపారు.

గ్రామంలో పారిశుధ్య కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తూ ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని సిబ్బందికి సూచించారు. గ్రామ పరిశుభ్రతకు ప్రజలు కూడా సహకరించాలని కోరారు.

కార్యక్రమంలో ఉపసర్పంచ్ జయసుధ స్వామి, పంచాయతీ కార్యదర్శి వీసం నరేందర్, వార్డు సభ్యులు కంబాలపల్లి సత్తయ్య, రాధారపు మహేశ్, వరికుప్పల స్వామి, నాగలక్ష్మిరాజు, కప్పల మంగమ్మ రాజు, పుట్టల లక్ష్మమ్మ ముత్యాలు, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పారిశుధ్య సిబ్బందికి నూతన దుస్తులు పంపిణీ. సర్పంచ్ గర్దాసు విక్రమ్

Article Image

రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం గ్రామపంచాయతీ పరిధిలో పారిశుధ్య నిర్వహణలో కీలకంగా పనిచేస్తున్న సిబ్బందికి నూతన దుస్తులు, గ్లౌజులు, మాస్కులు తదితర సానిటరీ సామగ్రిని పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ గర్దాసు విక్రమ్ మాట్లాడుతూ.. గ్రామాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా ఉంచడంలో పారిశుధ్య సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. సిబ్బంది విధులు నిర్వహించే సమయంలో రక్షణ, పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ అవసరమైన సామగ్రిని అందజేసినట్లు తెలిపారు.

గ్రామంలో పారిశుధ్య కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తూ ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని సిబ్బందికి సూచించారు. గ్రామ పరిశుభ్రతకు ప్రజలు కూడా సహకరించాలని కోరారు.

కార్యక్రమంలో ఉపసర్పంచ్ జయసుధ స్వామి, పంచాయతీ కార్యదర్శి వీసం నరేందర్, వార్డు సభ్యులు కంబాలపల్లి సత్తయ్య, రాధారపు మహేశ్, వరికుప్పల స్వామి, నాగలక్ష్మిరాజు, కప్పల మంగమ్మ రాజు, పుట్టల లక్ష్మమ్మ ముత్యాలు, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News