బోరు బావుల తవ్వకాలకు ముందస్తు అనుమతులు తప్పనిసరి.
రిగ్ డ్రిల్లర్లకు తహసిల్దార్ విజయ్కుమార్ సూచన.
చిట్యాల: బోరు బావుల తవ్వకాల్లో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని చిట్యాల తహసిల్దార్ విజయ్కుమార్ సూచించారు. మండల పరిధిలో బోరు బావులు తవ్వే రిగ్ డ్రిల్లర్ల యజమానులతో శుక్రవారం సమావేశం నిర్వహించిన ఆయన.. భూగర్భ జలాల పరిరక్షణకు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని స్పష్టం చేశారు.
బోరు బావుల తవ్వకాలకు ముందుగా సంబంధిత శాఖల నుంచి అనుమతులు పొందాలని తెలిపారు. గ్రౌండ్వాటర్ డిపార్ట్మెంట్ నిబంధనల ప్రకారం నిర్ణీత రుసుము చెల్లించి ప్రతి బోరును రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. బోరు తవ్వకానికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారులకు సమర్పించడంతో పాటు భూగర్భ జలాల వినియోగంలో వాల్టా చట్ట నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు.
అనుమతులు లేకుండా బోర్లు తవ్వడం, నిబంధనలకు విరుద్ధంగా భూగర్భ జలాలను వినియోగించడం వంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని తహసిల్దార్ విజయ్కుమార్ హెచ్చరించారు. భూగర్భ జలాల పరిరక్షణకు రిగ్ డ్రిల్లర్లు, రైతులు, ప్రజలు సహకరించాలని కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి