Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అంకిరెడ్డిగూడెంలో డంపింగ్ యార్డ్‌ నిర్మించవద్దు పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 14, 2026 06:55 PM

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
14-08-2026 39 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy


బోరు బావుల తవ్వకాలకు ముందస్తు అనుమతులు తప్పనిసరి.


రిగ్‌ డ్రిల్లర్లకు తహసిల్దార్ విజయ్‌కుమార్ సూచన.


చిట్యాల: బోరు బావుల తవ్వకాల్లో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని చిట్యాల తహసిల్దార్ విజయ్‌కుమార్ సూచించారు. మండల పరిధిలో బోరు బావులు తవ్వే రిగ్‌ డ్రిల్లర్ల యజమానులతో శుక్రవారం సమావేశం నిర్వహించిన ఆయన.. భూగర్భ జలాల పరిరక్షణకు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని స్పష్టం చేశారు.

బోరు బావుల తవ్వకాలకు ముందుగా సంబంధిత శాఖల నుంచి అనుమతులు పొందాలని తెలిపారు. గ్రౌండ్‌వాటర్‌ డిపార్ట్‌మెంట్‌ నిబంధనల ప్రకారం నిర్ణీత రుసుము చెల్లించి ప్రతి బోరును రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని సూచించారు. బోరు తవ్వకానికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారులకు సమర్పించడంతో పాటు భూగర్భ జలాల వినియోగంలో వాల్టా చట్ట నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు.

అనుమతులు లేకుండా బోర్లు తవ్వడం, నిబంధనలకు విరుద్ధంగా భూగర్భ జలాలను వినియోగించడం వంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని తహసిల్దార్ విజయ్‌కుమార్ హెచ్చరించారు. భూగర్భ జలాల పరిరక్షణకు రిగ్‌ డ్రిల్లర్లు, రైతులు, ప్రజలు సహకరించాలని కోరారు.

Sthanikam

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

Article Image


బోరు బావుల తవ్వకాలకు ముందస్తు అనుమతులు తప్పనిసరి.


రిగ్‌ డ్రిల్లర్లకు తహసిల్దార్ విజయ్‌కుమార్ సూచన.


చిట్యాల: బోరు బావుల తవ్వకాల్లో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని చిట్యాల తహసిల్దార్ విజయ్‌కుమార్ సూచించారు. మండల పరిధిలో బోరు బావులు తవ్వే రిగ్‌ డ్రిల్లర్ల యజమానులతో శుక్రవారం సమావేశం నిర్వహించిన ఆయన.. భూగర్భ జలాల పరిరక్షణకు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని స్పష్టం చేశారు.

బోరు బావుల తవ్వకాలకు ముందుగా సంబంధిత శాఖల నుంచి అనుమతులు పొందాలని తెలిపారు. గ్రౌండ్‌వాటర్‌ డిపార్ట్‌మెంట్‌ నిబంధనల ప్రకారం నిర్ణీత రుసుము చెల్లించి ప్రతి బోరును రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని సూచించారు. బోరు తవ్వకానికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారులకు సమర్పించడంతో పాటు భూగర్భ జలాల వినియోగంలో వాల్టా చట్ట నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు.

అనుమతులు లేకుండా బోర్లు తవ్వడం, నిబంధనలకు విరుద్ధంగా భూగర్భ జలాలను వినియోగించడం వంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని తహసిల్దార్ విజయ్‌కుమార్ హెచ్చరించారు. భూగర్భ జలాల పరిరక్షణకు రిగ్‌ డ్రిల్లర్లు, రైతులు, ప్రజలు సహకరించాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News